Deputy CM Bhatti Vikramarka: తప్పు చేశారా లేదా అని చెప్పాల్సింది కేటీఆర్ కాదు..
- హాస్టల్ విద్యార్థులకు మెనూను మార్చేశాం
- ప్రతి విద్యార్థికి హెల్త్ కార్డు ఇస్తామని.. ప్రతి నెలా చెకప్ చేయిస్తాం
- కేటీఆర్ తప్పు చేశారా లేదా అని చెప్పాల్సిందని ఆయన కాదు
- ఏం తప్పు జరిగిందో విచారణ సంస్థలు తేలుస్తాయి
- ఎన్టీవీతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫేస్2ఫేస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Bhatti Vikramarka: హాస్టల్ విద్యార్థులకు మెనూను మార్చేశామని.. ప్రతి విద్యార్థికి హెల్త్ కార్డు ఇస్తామని.. ప్రతి నెలా చెకప్ చేయిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పేదల కష్టాలు ఏంటో మాకు తెలుసన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు ఛార్జీలు పెంచామన్నారు. ముఖ్యమంత్రి, అధికారులతో పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరం 40 శాతం వరకు విద్యార్థులకు అందించే ఛార్జీలు పెంచామన్నారు. పిల్లలు ఎదిగేందుకు కావాల్సినవన్ని సమకూర్చేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కేటీఆర్ తప్పు చేశారా లేదా అని చెప్పాల్సిందని ఆయన కాదని.. ఏం తప్పు జరిగిందో విచారణ సంస్థలు తేలుస్తాయన్నారు.
Read Also: KTR: ఈ-కార్ రేసింగ్పై అసెంబ్లీలో చర్చకు సిద్ధం
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
అప్పులకు మేం వ్యతిరేకం కాదని.. అప్పులు ఎలా ఉపయోగించారు అన్నదే ముఖ్యమన్నారు. రూ.లక్ష కోట్లు కాళేశ్వరంలో పోస్తే.. ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. ఆర్థిక శాఖ నిర్వహణ భారమే.. కానీ అది పార్టీ అప్పగించిన బాధ్యత అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. పేదల పన్నులతో వచ్చేఆదాయం తప్పుదారి పట్టకూడదని జాగ్రత్త పడుతున్నామన్నారు. విద్యుత్ కమిషన్ రిపోర్ట్ వచ్చిందని.. ఏం చేయాలన్నది అధికారులు స్టడీ చేస్తున్నారన్నారు. దూకుడుగా అరెస్టులు చేయాల్సిన అవసరం మాకు లేదన్నారు. విచారణలు పూర్తవ్వాలని.. నిబంధనల మేరకే వ్యవహారం ఉంటుందన్నారు. భూమి లేని పేదలకు సాయం చేస్తామంటే.. బీఆర్ఎస్కు నచ్చడం లేదని ఆయన విమర్శించారు. అందుకే తను ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారన్నారు.
Read Also: TG CETs: ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం
మధ్యాహ్నం మీడియా చిట్చాట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ కెప్టెన్ లేని నావ అంటూ ఆయన పేర్కొన్నారు.తుపాన్లో చిక్కుకున్న షిప్ ఎక్కడికి వెళ్తుందో తెలియదన్నారు. నాయకుడు లేకుంటే పార్టీ ఎలా ఉంటుందో బీఆర్ఎస్ పరిస్థితి అలా ఉందన్నారు. సభలో చర్చ జరగాలని బీఆర్ఎస్కు లేదన్నారు. రచ్చ చేసి బయటకు వెళ్ళాలి అని బీఆర్ఎస్ ఉందన్నారు. చర్చ జరగాలి అనేది మా ఆలోచన అన్నారు. బీఆర్ఎస్ సభను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. భూమి లేని వారికి డబ్బులు ఇస్తాం అంటే.. బీఆర్ఎస్ అడ్డుకుంటుందన్నారు.
తాజావార్తలు
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!