Ayodhya Diwali: ప్రపంచ రికార్డు సృష్టించేందుకు రెడీ అవుతున్న రాంలాలా ఆలయం
- ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో.
- ప్రపంచ రికార్డు సృష్టించేందుకు రెడీ..
- మహా దీపోత్సవంలో 28 లక్షల దీపాలను అలంకరించేందుకు 30 వేల మందికి పైగా వాలంటీర్ల నియామకం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Diwali: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఎనిమిదో దీపోత్సవం సందర్భంగా సరయూ నది ఒడ్డున 28 లక్షల దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రాంలాలా ఆలయంలో ఈసారి ప్రత్యేక దీపాలను వెలిగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నూతనంగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి ఆలయంలో మొదటి దీపావళికి గ్రాండ్ గా “పర్యావరణ స్పృహ”తో సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబరు 30న సరయూ ఘాట్ల వద్ద జరిగే మహా దీపోత్సవంలో 28 లక్షల దీపాలను అలంకరించేందుకు 30 వేల మందికి పైగా వాలంటీర్లను నియమించారు.
Read Also: Fire Accident : అబిడ్స్లోని క్రాకర్స్ షాపులో భారీ అగ్నిప్రమాదం…
Also Read
- Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
- Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య
- Imran Khan Gets Relief: ఇమ్రాన్ ఖాన్కు పాక్ కోర్టులో భారీ ఊరట..
- AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ప్రకారం, ఈ ప్రత్యేక రకాల దీపాలు ఆలయ భవనాన్ని మరకలు, మసి నుండి కాపాడతాయి. అలాగే ఎక్కువ సేపు కాంతిని కూడా అందిస్తాయి. శ్రీరామజన్మభూమి ఆలయాన్ని ఆకర్షణీయమైన పూలతో అలంకరించేందుకు ప్రత్యేక ప్రణాళికను కూడా రూపొందించినట్లు తెలిపారు. ఆలయ సముదాయాన్ని అనేక విభాగాలుగా, ఉపవిభాగాలుగా విభజించి అలంకరణ బాధ్యతలు అప్పగించారు. బీహార్ కేడర్కు చెందిన రిటైర్డ్ ఐపిఎస్ అధికారి అషు శుక్లాకు ఆలయంలోని ప్రతి మూలను క్రమపద్ధతిలో వెలిగించడం, అన్ని ద్వారాలను తోరణాలతో అలంకరించడం, శుభ్రపరచడం ఇంకా అలంకరణ చేయడం వంటి బాధ్యతలను అప్పగించారు. దీంతో అందమైన పూలతో, దీపాలతో అలంకరించిన ఆలయాన్ని భక్తులు దర్శించుకోనున్నారు. ఈ సారి వెలుగుల పండుగలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ప్రతినిధి తెలిపారు.
Read Also: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నిద్రమత్తుకు ఇద్దరు బలి
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, అవధ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ ప్రతిభా గోయల్ ఉద్దేశం మేరకు సరయూలోని 55 ఘాట్ల వద్ద ఈ భారీ వాలంటీర్ల బృందాన్ని మోహరించారు. రెండు వేల మందికి పైగా సూపర్ వైజర్లు, కోఆర్డినేటర్లు, ఘాట్ ఇన్ఛార్జ్లు, దీపాల లెక్కింపు, ఇతర సభ్యుల పర్యవేక్షణలో 30 వేల మందికి పైగా వాలంటీర్లు ఘాట్ల వద్ద 28 లక్షల దీపాలను అలంకరించేందుకు కృషి చేస్తున్నారని ప్రతినిధి తెలిపారు.
తాజావార్తలు
-
Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
-
Imran Khan Gets Relief: ఇమ్రాన్ ఖాన్కు పాక్ కోర్టులో భారీ ఊరట..
-
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య
-
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
-
Supreme Court: CJP నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!