Ayodhya Diwali: ప్రపంచ రికార్డు సృష్టించేందుకు రెడీ అవుతున్న రాంలాలా ఆలయం
- ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో.
- ప్రపంచ రికార్డు సృష్టించేందుకు రెడీ..
- మహా దీపోత్సవంలో 28 లక్షల దీపాలను అలంకరించేందుకు 30 వేల మందికి పైగా వాలంటీర్ల నియామకం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Diwali: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఎనిమిదో దీపోత్సవం సందర్భంగా సరయూ నది ఒడ్డున 28 లక్షల దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రాంలాలా ఆలయంలో ఈసారి ప్రత్యేక దీపాలను వెలిగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నూతనంగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి ఆలయంలో మొదటి దీపావళికి గ్రాండ్ గా “పర్యావరణ స్పృహ”తో సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబరు 30న సరయూ ఘాట్ల వద్ద జరిగే మహా దీపోత్సవంలో 28 లక్షల దీపాలను అలంకరించేందుకు 30 వేల మందికి పైగా వాలంటీర్లను నియమించారు.
Read Also: Fire Accident : అబిడ్స్లోని క్రాకర్స్ షాపులో భారీ అగ్నిప్రమాదం…
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ప్రకారం, ఈ ప్రత్యేక రకాల దీపాలు ఆలయ భవనాన్ని మరకలు, మసి నుండి కాపాడతాయి. అలాగే ఎక్కువ సేపు కాంతిని కూడా అందిస్తాయి. శ్రీరామజన్మభూమి ఆలయాన్ని ఆకర్షణీయమైన పూలతో అలంకరించేందుకు ప్రత్యేక ప్రణాళికను కూడా రూపొందించినట్లు తెలిపారు. ఆలయ సముదాయాన్ని అనేక విభాగాలుగా, ఉపవిభాగాలుగా విభజించి అలంకరణ బాధ్యతలు అప్పగించారు. బీహార్ కేడర్కు చెందిన రిటైర్డ్ ఐపిఎస్ అధికారి అషు శుక్లాకు ఆలయంలోని ప్రతి మూలను క్రమపద్ధతిలో వెలిగించడం, అన్ని ద్వారాలను తోరణాలతో అలంకరించడం, శుభ్రపరచడం ఇంకా అలంకరణ చేయడం వంటి బాధ్యతలను అప్పగించారు. దీంతో అందమైన పూలతో, దీపాలతో అలంకరించిన ఆలయాన్ని భక్తులు దర్శించుకోనున్నారు. ఈ సారి వెలుగుల పండుగలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ప్రతినిధి తెలిపారు.
Read Also: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నిద్రమత్తుకు ఇద్దరు బలి
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, అవధ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ ప్రతిభా గోయల్ ఉద్దేశం మేరకు సరయూలోని 55 ఘాట్ల వద్ద ఈ భారీ వాలంటీర్ల బృందాన్ని మోహరించారు. రెండు వేల మందికి పైగా సూపర్ వైజర్లు, కోఆర్డినేటర్లు, ఘాట్ ఇన్ఛార్జ్లు, దీపాల లెక్కింపు, ఇతర సభ్యుల పర్యవేక్షణలో 30 వేల మందికి పైగా వాలంటీర్లు ఘాట్ల వద్ద 28 లక్షల దీపాలను అలంకరించేందుకు కృషి చేస్తున్నారని ప్రతినిధి తెలిపారు.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!