Delhi Crime: ఢిల్లీలో హత్య చిత్రీకరణ.. 37 సెకన్ల వీడియోను పాకిస్థాన్కు పంపి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Man Hacked To Death: దేశ రాజధాని ఢిల్లీలో గుర్తించిన మృతదేహం వెనుక ఉగ్రకోణం వెలుగులోకి వచ్చింది. పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులను విచారిస్తున్న కొద్దీ దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ నిందితులు ఢిల్లీలో హత్యను చిత్రీకరించి ఆ వీడియోను పాకిస్థాన్లోని ఓ ఉగ్రవాదికి పంపినట్లు తెలిసింది. పాక్లోని వ్యక్తుల సూచనల మేరకు వారు ఢిల్లీలో ఓ వ్యక్తిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారికి ఉగ్ర సంబంధాలున్నాయనే అనుమానంతో గురువారం రాత్రి జహంగీర్పూర్ పరిసరాల్లో ఓ ఇంటిపై పోలీసులు దాడి చేసి ఇద్దరు నిందితులు జగ్జీత్ సింగ్ అలియాస్ జగ్గా(29), నౌషద్(59)లను అరెస్ట్ చేశారు. వారిద్దరి నుంచి మూడు పిస్తోళ్లు, 22రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ టార్గెట్ కిల్లింగ్స్కు పాల్పడేందుకు యత్నిస్తున్నట్లు అనుమానించారు.
విచారణలో భాగంగా భలాస్వా డెయిరీ శ్రద్ధానంద్ కాలనీలో వీరు అద్దెకు ఉంటున్న ఇంట్లో తనిఖీలు చేయగా.. రెండు గ్రనేడ్లు దొరికాయి. దీంతో ఫోరెన్సిక్ బృందం అక్కడ గాలింపు జరపగా.. రక్తపు మరకలు బయటపడ్డాయి. దీంతో నిందితులు ఎవరినో హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఆ దిశగా విచారణ జరపగా.. భయంకరమైన విషయాలు బయటపడ్డాయి.
Also Read
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
- IndiGo Flights Suspended: విదేశీ ప్రయాణికులకు అలర్ట్.. కీలక రూట్లలో ఇండిగో సర్వీసులు రద్దు
- Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
ఆదర్శ్ నగర్లోని ఓ మాదకద్రవ్యాల బానిస 21 ఏళ్ల వ్యక్తితో వీరిద్దరూ స్నేహంగా ఉంటూ అతడిని భలాస్వా డెయిరీ సమీపంలోకి ఇంటికి తీసుకొచ్చి హత్య చేసినట్లు గుర్తించారు. అతడిని చంపుతున్నప్పుడు 37 సెకన్ల వీడియోను చిత్రీకరించి పాకిస్థాన్లోని లష్కరే ఉగ్రవాది సోహైల్కు పంపినట్లు తేలింది. అతని శరీరాన్ని ఎనిమిది ముక్కలుగా నరికి చంపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వారు హత్యకు సంబంధించిన 37 సెకన్ల వీడియోను రికార్డ్ చేసి, పాకిస్తాన్లోని లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న సోహైల్ అనే వ్యక్తికి పంపారు. ఖతార్లోని అతని బావమరిది ద్వారా నౌషాద్ బ్యాంకు ఖాతాకు రూ.2 లక్షలు పంపించారు. మృతదేహాన్ని 8 ముక్కలుగా నరికి ఉత్తర ఢిల్లీలో పారేశారు. తాజాగా నిందితులు చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు గాలింపు జరిపి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు. చేతిపై ఉన్న త్రిశూలం పచ్చబొట్టు ఆధారంగా మృతదేహాన్ని గుర్తించారు.
NCP MP Supriya Sule: ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే చీరకు మంటలు.. వీడియో వైరల్
ఈ క్రూరమైన నేరంలో పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ కుట్రపై దర్యాప్తు సంస్థలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి. నౌషద్ ఒక ఉగ్రవాది, హత్య, దోపిడీ వంటి అనేక కేసుల్లో అతను చాలా కాలంగా జైలులో ఉన్నాడని, అతను ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్-అన్సార్తో సంబంధం కలిగి ఉన్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. జైలులో ఎర్రకోట దాడి నిందితుడు ఆరిఫ్ మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాది సోహైల్లను కలిశాడు. సోహైల్ 2018లో పాకిస్థాన్కు వెళ్లాడని, ఏప్రిల్ 2022లో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నౌషాద్ సోహైల్తో టచ్లో ఉన్నాడని వర్గాలు తెలిపాయి. ప్రభావవంతమైన హిందువులను హతమార్చేందుకు నౌషద్కు సోహైల్ బాధ్యతలు అప్పగించగా.. రెండో నిందితుడు జగ్జీత్ సింగ్ను భారతదేశంలో సిక్కు వేర్పాటువాద గ్రూప్ ఖలిస్తాన్ కార్యకలాపాలను ప్రచారం చేయమని కోరినట్లు వర్గాలు తెలిపాయి.
Afghanistan Taliban: మాకు ఇస్లామిక్ చట్టమే ముఖ్యం.. మహిళల హక్కులు కాదు
ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్దీప్ దల్లాతో జగ్జీత్కు సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుల నుంచి మూడు పిస్టల్స్, 22 కాట్రిడ్జ్లు, రెండు హ్యాండ్ గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు 2020లో మత ఘర్షణలు జరిగిన జహంగీర్పురిలో నివసిస్తున్నారని, అయితే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు దాని గురించి ఎటువంటి క్లూ లేదని వర్గాలు తెలిపాయి. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నివశిస్తున్న నిందితులపై ఢిల్లీ పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇది ఇజ్రాయెల్ ఎంబసీ టెర్రర్ సంఘటనతో ముడిపడి ఉంది, దీనికి ఇప్పటివరకు ఎటువంటి క్లూ కనుగొనబడలేదు. ఢిల్లీలోని ఘాజీపూర్, సీమాపురిలో దొరికిన ఆర్డీఎక్స్కు సంబంధించిన కేసు కూడా ఇప్పటికీ పరిష్కరించబడలేదు.
తాజావార్తలు
-
Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
-
Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
-
Janvi Kapoor : ‘అచ్చియమ్మ’ కూడా అచ్చి రాలేదే!
-
Ram Charan: ‘చిట్టిబాబు’ వర్సెస్ ‘పెద్దిగాడు’: రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఏది?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!