Delhi floods: ఇంకా వరదల్లోనే ఢిల్లీ.. హథినికుండ్ బ్యారేజీ నుంచి మళ్లీ నీటి విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో వరద ముప్పు ఇంకా కొనసాగుతుంది. హథినికుండ్ బ్యారేజీ నుంచి మరోసారి నీటిని విడుదల చేయడంతో యమునా నది నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. బ్యారేజీ నుంచి విడుదల చేసిన నీరు రేపు సాయంత్రానికి ఢిల్లీకి చేరుకుంటుందని.. ఈ సందర్భంలో యమునా నీటిమట్టం 206.70 మీటర్లకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు నీటిమట్టం పెరుగుతుందనే భయంతో ఢిల్లీ యంత్రాంగం లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించింది. శుక్రవారం సాయంత్రం నది నీటిమట్టం 205.34 మీటర్లుగా నమోదవగా, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టి 205.17గా నమోదైంది. అయితే ఈరోజు రాత్రికి నదిలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి యమునా నీటిమట్టం 206.70కి చేరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో మరోసారి వరద ముప్పు పొంచి ఉంది.
Woman Suicide: మరో మహిళతో భర్త.. తట్టుకోలేక పిల్లలతో కలిసి రైలు కింద దూకి..!
Also Read
- Mallikarjun Kharge: లోక్సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
- TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
- MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
హథినికుండ్ బ్యారేజీ నుంచి శనివారం 2 లక్షల 9 వేల క్యూసెక్కుల నీటిని యమునాలోకి విడుదల చేసినట్లు సమాచారం. గత వారం.. యమునా నీరు ఢిల్లీలో భారీ విధ్వంసం సృష్టించింది. ఎర్రకోట, ఢిల్లీ సెక్రటేరియట్, అక్షరధామ్, మయూర్ బీహార్తో సహా అనేక ప్రాంతాలు మునిగిపోయాయి. ప్రస్తుతం యమునా నది నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేశారు. కొండ ప్రాంతాలలో కురిసిన వర్షాల కారణంగా.. ఆ వరద నీరు హథినికుండ్ బ్యారేజీకి చేరుతుంది. దీంతో నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఆ నీరు ఢిల్లీకి చేరుకోవడానికి 24 గంటలకు పైగా సమయం పడుతుంది.
Fargana Hoque: బంగ్లాదేశ్ తరఫున తొలి సెంచరీ నమోదు.. రికార్డు బద్దలు
మరోవైపు ఘజియాబాద్లో హిండన్ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నీటిమట్టం పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది. హిందోన్ బీహార్, సిటీ ఫారెస్టర్ కాలనీ, కృష్ణ గౌశాల కాలనీ, నంద్ గ్రామ్ కాలనీ ప్రాంతాల్లోకి హిండన్ నది నీరు చేరింది. ఇక్కడ కూడా నది ఒడ్డున నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. నది ఒడ్డున చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది.
తాజావార్తలు
-
Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!
-
Mallikarjun Kharge: లోక్సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
-
MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
-
Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!