Delhi floods: ఇంకా వరదల్లోనే ఢిల్లీ.. హథినికుండ్ బ్యారేజీ నుంచి మళ్లీ నీటి విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో వరద ముప్పు ఇంకా కొనసాగుతుంది. హథినికుండ్ బ్యారేజీ నుంచి మరోసారి నీటిని విడుదల చేయడంతో యమునా నది నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. బ్యారేజీ నుంచి విడుదల చేసిన నీరు రేపు సాయంత్రానికి ఢిల్లీకి చేరుకుంటుందని.. ఈ సందర్భంలో యమునా నీటిమట్టం 206.70 మీటర్లకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు నీటిమట్టం పెరుగుతుందనే భయంతో ఢిల్లీ యంత్రాంగం లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించింది. శుక్రవారం సాయంత్రం నది నీటిమట్టం 205.34 మీటర్లుగా నమోదవగా, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టి 205.17గా నమోదైంది. అయితే ఈరోజు రాత్రికి నదిలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి యమునా నీటిమట్టం 206.70కి చేరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో మరోసారి వరద ముప్పు పొంచి ఉంది.
Woman Suicide: మరో మహిళతో భర్త.. తట్టుకోలేక పిల్లలతో కలిసి రైలు కింద దూకి..!
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
హథినికుండ్ బ్యారేజీ నుంచి శనివారం 2 లక్షల 9 వేల క్యూసెక్కుల నీటిని యమునాలోకి విడుదల చేసినట్లు సమాచారం. గత వారం.. యమునా నీరు ఢిల్లీలో భారీ విధ్వంసం సృష్టించింది. ఎర్రకోట, ఢిల్లీ సెక్రటేరియట్, అక్షరధామ్, మయూర్ బీహార్తో సహా అనేక ప్రాంతాలు మునిగిపోయాయి. ప్రస్తుతం యమునా నది నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేశారు. కొండ ప్రాంతాలలో కురిసిన వర్షాల కారణంగా.. ఆ వరద నీరు హథినికుండ్ బ్యారేజీకి చేరుతుంది. దీంతో నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఆ నీరు ఢిల్లీకి చేరుకోవడానికి 24 గంటలకు పైగా సమయం పడుతుంది.
Fargana Hoque: బంగ్లాదేశ్ తరఫున తొలి సెంచరీ నమోదు.. రికార్డు బద్దలు
మరోవైపు ఘజియాబాద్లో హిండన్ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నీటిమట్టం పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది. హిందోన్ బీహార్, సిటీ ఫారెస్టర్ కాలనీ, కృష్ణ గౌశాల కాలనీ, నంద్ గ్రామ్ కాలనీ ప్రాంతాల్లోకి హిండన్ నది నీరు చేరింది. ఇక్కడ కూడా నది ఒడ్డున నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. నది ఒడ్డున చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది.
తాజావార్తలు
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!