Kejriwal: ఢిల్లీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం.. ఎంసీడీ స్కూళ్ల తీరుపై ఆక్షేపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందుబాటులో లేకపోవడంపై దాఖలైన పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు.. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. స్కూళ్లలో అవసరమైన విద్యా సామగ్రి లేకపోవడాన్ని చూస్తుంటే విద్యార్థులను కనీసం పట్టించుకోనట్లు కనిపిస్తోందని కోర్టు తీవ్రంగా మందలించింది. జ్యుడీషియల్ కస్టడీ నుంచి పాలన సాగించడం పట్లపై న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఇది కూడా చదవండి: Off The Record: ఇద్దరినీ పక్కన పెట్టడంతో కేడర్లో అసహనం.. కంచుకోటకు బీటలు పడే ముప్పు ముంచుకొచ్చిందా?
Also Read
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంల పంపిణీకి సంబంధించి.. నేరుగా జోక్యం చేసుకునే అధికారం తమ పరిధిలో లేదని కోర్టు స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వ బాధ్యతల్లో లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తున్నందున సమస్యను పరిష్కరించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం తమ బాధ్యతల్లో విఫలమైనందునే జోక్యం చేసుకోవల్సి వస్తుందని న్యాయస్థానం పేర్కొంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. అక్కడ నుంచే ప్రస్తుతం కేజ్రీవాల్ పరిపాలన సాగిస్తున్నారు. బెయిల్ పిటిషన్లను న్యాయస్థానాలు తిరస్కరించాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్న లభించడం లేదు. ఇంకోవైపు షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. ఇన్సులిన్ అందించాలని కేజ్రీవాల్ కోర్టును కోరారు. దీనిపై కూడా తీర్పు రాలేదు. తాజాగా ఎంసీడీ స్కూళ్ల తీరుపై హైకోర్టు ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. దీనిపై ఆప్ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Jammu kashmir: రాంబన్ జిల్లాలో కుంగిన భూమి.. దెబ్బతిన్న 30 ఇళ్లు
తాజావార్తలు
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
-
Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?