Kejriwal: ఢిల్లీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం.. ఎంసీడీ స్కూళ్ల తీరుపై ఆక్షేపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందుబాటులో లేకపోవడంపై దాఖలైన పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు.. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. స్కూళ్లలో అవసరమైన విద్యా సామగ్రి లేకపోవడాన్ని చూస్తుంటే విద్యార్థులను కనీసం పట్టించుకోనట్లు కనిపిస్తోందని కోర్టు తీవ్రంగా మందలించింది. జ్యుడీషియల్ కస్టడీ నుంచి పాలన సాగించడం పట్లపై న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఇది కూడా చదవండి: Off The Record: ఇద్దరినీ పక్కన పెట్టడంతో కేడర్లో అసహనం.. కంచుకోటకు బీటలు పడే ముప్పు ముంచుకొచ్చిందా?
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంల పంపిణీకి సంబంధించి.. నేరుగా జోక్యం చేసుకునే అధికారం తమ పరిధిలో లేదని కోర్టు స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వ బాధ్యతల్లో లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తున్నందున సమస్యను పరిష్కరించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం తమ బాధ్యతల్లో విఫలమైనందునే జోక్యం చేసుకోవల్సి వస్తుందని న్యాయస్థానం పేర్కొంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. అక్కడ నుంచే ప్రస్తుతం కేజ్రీవాల్ పరిపాలన సాగిస్తున్నారు. బెయిల్ పిటిషన్లను న్యాయస్థానాలు తిరస్కరించాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్న లభించడం లేదు. ఇంకోవైపు షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. ఇన్సులిన్ అందించాలని కేజ్రీవాల్ కోర్టును కోరారు. దీనిపై కూడా తీర్పు రాలేదు. తాజాగా ఎంసీడీ స్కూళ్ల తీరుపై హైకోర్టు ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. దీనిపై ఆప్ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Jammu kashmir: రాంబన్ జిల్లాలో కుంగిన భూమి.. దెబ్బతిన్న 30 ఇళ్లు
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?