CM Rekha Gupta: సీఎం రేఖా గుప్తాకు ప్రాణహాని.. భద్రత కట్టుదిట్టం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Rekha Gupta: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ఒక గుర్తుతెలియని వ్యక్తి ప్రాణహాని బెదిరింపు కాల్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆమె భద్రతను శుక్రవారం అధికారులు మరింతగా పెంచారు. ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ లో పోలీస్ కంట్రోల్ రూమ్కు గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఫోన్ చేసి ఈ బెదిరింపు చేసినట్టు ఘాజియాబాద్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ తెలిపారు.
Read Also: Covid-19 Variant: వేగంగా వ్యాపిస్తున్న కొత్త కోవిడ్ వేరియంట్.. లక్షణాలు ఎలా ఉన్నాయంటే..?
Also Read
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
బెదిరింపు కాల్ చేసిన తర్వాత ఆ కాలర్ తన మొబైల్ ఫోన్ను వెంటనే ఆఫ్ చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఘాజియాబాద్ పోలీస్ ఇంటర్-స్టేట్ కోఆర్డినేషన్ సెల్, ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించింది. టెలికాం కంపెనీ సహాయంతో బెదిరింపు ఇచ్చిన ఫోన్కు సంబంధించిన సిమ్ యజమానిని పోలీసులు గుర్తించినప్పటికీ, గురువారం రాత్రి 11 తర్వాత ఆ ఫోన్ను ఎవరూ ఆన్ చేయలేదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
Read Also: Preity Zinta: ఆశించినట్టు ముగియలేదు.. ఫైనల్ పరాజయంపై స్పందించిన ప్రీతీ జింటా..!
ఈ బెదిరింపు తర్వాత సీఎం రేఖా గుప్తా పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొనడాన్ని పరిమితం చేసే అవకాశం కనపడుతోంది. ఆమెకు ఏర్పాటు చేయబడ్డ సెక్యూరిటీని మరింత బలపరిచినట్లు సమాచారం. ఇకపోతే, ఢిల్లీ ముఖ్యమంత్రులపై బెదిరింపులు, దాడులు ఇది కొత్తకాదు. 2019లో అప్పటి సీఎం అర్వింద్ కేజ్రీవాల్పై ఒక ఆటో డ్రైవర్ దాడి చేశాడు. ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ఆ వ్యక్తి ఆరోపించాడు. అంతకుముందు 2016లో ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో కేజ్రీవాల్పై బ్లాక్ ఇంక్ విసిరారు. అంతేకాకుండా 2025 ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో సావిత్రి నగర్లో కేజ్రీవాల్పై ద్రవ పదార్థం విసిరిన ఘటన కలకలం రేపింది.
తాజావార్తలు
-
Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
-
Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
-
Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!