Delhi CM Kejriwal : ప్రధానికి కేజ్రీవాల్ లేఖ.. రైల్వేలో వృద్ధులకు మినహాయింపు ఇవ్వండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi CM Kejriwal : రైల్వేలో వృద్ధులకు మినహాయింపు ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ లేఖ ద్వారా ప్రధానిని ఆయన టార్గెట్ చేశారు. వృద్ధుల మినహాయింపును రద్దు చేయడం చాలా దురదృష్టకరమని.. వారి ఆశీర్వాదం లేకుండా దేశం అభివృద్ధి చెందదని కేజ్రీవాల్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్లకు రైల్వే ఛార్జీల రాయితీని రద్దు చేసి చాలా కాలం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ విషయమై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధానిని కోరారు.
Read Also: Pawan Kalyan Delhi Tour: ఢిల్లీలో జనసేనాని.. ఇద్దరు కీలక నేతలతో భేటీ..!
Also Read
- Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
రూ.1600 కోట్లు ఆదా చేసేందుకు వృద్ధులకు రాయితీ తొలగించడం సరికాదన్నారు. వృద్ధులను తీర్థయాత్రలు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం తన బడ్జెట్లో 50 కోట్లు ఖర్చు చేస్తుందని, తద్వారా ప్రభుత్వానికి ఎటువంటి నష్టం జరగదన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా చేయాలని కేజ్రీవాల్ తన లేఖలో రాశారు. వాస్తవానికి, కోవిడ్ మహమ్మారి సమయంలో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, సీనియర్ సిటిజన్లతో సహా మూడు కేటగిరీలు మినహా మిగిలిన అన్నింటికి ఛార్జీల మినహాయింపును రైల్వే నిలిపివేసింది. కరోనా మహమ్మారికి ముందు, 60 ఏళ్లు పైబడిన పౌరులు 50 శాతం తగ్గింపు పొందేవారు. మహమ్మారి ముప్పు తగ్గిన తర్వాత, దేశంలోని అన్ని ఇతర కార్యకలాపాలు పూర్తిగా సాధారణమైన తర్వాత కూడా సీనియర్ సిటిజన్లకు ఈ ఉపశమనం పునరుద్ధరించబడలేదు. దిల్లీ సీఎం కేజ్రీవాల్తో సహా పలు పార్టీల నేతలు చాలా కాలంగా దీనిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..