IPL 2024: విశాఖ చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్.. ప్రాక్టీస్లో బిజీబిజీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Capitals Players Reach Vizag for IPL 2924: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో మూడు రోజుల్లో ఆరంభం కానుంది. మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సొంత మైదానాల్లో సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ కాపిటల్స్ టీమ్ సభ్యులు కొందరు సోమవారం విశాఖకు చేరుకుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆటగాళ్లు.. రోడ్డు మార్గాన రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్కి వెళ్లారు. డీసీ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలి, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సహా మరికొందరు ప్లేయర్స్ విశాఖకు చేరుకున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ టీం సభ్యులు చాలామంది ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు. డేవిడ్ వార్నర్ సహా మరికొందరు ప్లేయర్స్ జట్టుతో కలవనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ ప్లేయర్స్ వైఎస్సార్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఈసారి ఐపీఎల్ మ్యాచులకు విశాఖ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ స్టేడియం ఢిల్లీ జట్టుకు హోమ్ గ్రౌండ్గా ఉంది. ఈ సీజన్లో తొలి విడతలో 21 మ్యాచ్లు 10 నగరాల్లో జరగనుండగా.. అందులో రెండు మ్యాచ్లు విశాఖలోనే షెడ్యూల్ చేయబడ్డాయి.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
Also Read: Suicide Attempt in Flight: విమానంలో ప్రయాణికుడి ఆత్మహత్యాయత్నం.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!
ఢిల్లీ క్యాపిటల్స్ సొంత మైదానం అరుణ్ జైట్లీ స్టేడియం అన్న విషయం తెలిసిందే. ఈ మైదానంలో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 సెకెండ్ ఆఫ్ మ్యాచ్లతో పాటు ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్లు జరిగాయి. వరుస మ్యాచ్ల కారణంగా పిచ్ దెబ్బతినే ప్రమాదం ఉండటంతో.. డీసీ యాజమాన్యం, బీసీసీఐ సంయుక్తంగా వేదికను విశాఖకు తరలించేందుకు అంగీకరించారు. ప్రస్తుతానికి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ రెండు హోం గేమ్స్ను విశాఖలో ఆడనుంది. మార్చి 31న చెన్నైతో, ఏప్రిల్ 3న కేకేఆర్తో విశాఖలో ఢిల్లీ ఆడనుంది. ఇక రెండో విడతలో ఢిల్లీ ఆడాల్సిన 5 హోం గేమ్స్ను సొంత మైదానంలోనే ఆడుతుంది. ఢిల్లీ తమ తొలి మ్యాచ్ను మార్చి 23న మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్తో తలపడనుంది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!