WPL 2024: వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో లీగ్ దశలో భాగంగా జరిగిన ఆఖరి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. బుధవారం నాడు జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ జెంట్స్ పై 7 వికెట్ల తేడాతో భారీ విజయం అందుకుంది. దీంతో ఢిల్లీ వరుసగా రెండోసారి ఫైనల్ లో అడుగు పెట్టింది. గుజరాత్ జైన్స్ నిర్ణయించిన 127 పరుగుల స్వల్ప లక్షాన్ని ఢిల్లీ ఛేదించి ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్ లో షఫాలీ వర్మ హాఫ్ సెంచరీతో చెలరేగగా, జెమిమా రోడ్రిగ్స్ కూడా 38 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ప్రీమియర్ లీగ్ లో వరుసగా రెండోసారి ఫైనల్స్ కు చేరినట్లయింది.
కేవలం 127 పరుగుల లక్ష్య ఛేదనను ఢిల్లీ క్యాపిటల్స్ కాస్త ఘనంగానే మొదలు పెట్టింది. ఈ మ్యాచ్ లో జరిగిన మూడో ఓవర్లోనే గుజరాత్ జెంట్స్ రెండు వికెట్లు తీసి గేమ్ లోకి వచ్చినట్లు కనిపించింది. ఇందులో
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ మెగ్ లానింగ్ రనౌట్ అవ్వగా, ఇక అదే ఓవర్ లో అలీస్ కాప్సీ డక్ అవుట్ అయ్యి పెవిలియన్ బాట పట్టింది. పరిస్థితి ఇలా ఉన్న యంగ్ బ్యాటర్ షఫాలీ వర్మ మాత్రం ఎక్కడ జోరు తగ్గించలేదు. తన మార్క్ షాట్స్ తో బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. షఫాలీ వర్మకు తోడుగా జెమిమా రోడ్రిగ్స్ కూడా అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడడంతో గుజరాత్ కు మరో ఛాన్స్ ఇవ్వలేదు ఇద్దరు. దింతో మూడో వికెట్ కు ఏకంగా 94 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు
Also Read
- Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
- Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
- Russian Ruble: డాలర్కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
- Modi-Meloni Selfie Goes Viral: వైరల్గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 126 పరుగులు మాతరమే చేయగలిగింది. ఇందులో ఓపెనర్లు వోల్వ్రాట్ 7, బెత్ ముూనీ డక్ అవుట్., స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆపై వన్ డౌన్ లో బ్యాటింగ్ కి వచ్చిన హేమలత కూడా కేవలం 4 పరుగులు చేసి అవుట్ అవ్వడంతో ప్రభావం చూపలేకపోయింది. గార్డ్నర్ 12, ఫోబి లిచ్ఫీల్డ్ 21 పరుగులు చేయగా.. భారతి ఫుల్ మలి 42, బ్రేస్ 22 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడంతో గుజరాత్ జెంట్స్ కు ఆ మాత్రం స్కోరైనా దక్కింది.
తాజావార్తలు
-
Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
-
Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
-
Riyan Parag: మేము కూడా మనుషులమే, తప్పులు జరుగుతాయి.. ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవడూ లేడు!
-
TeluguOne Ravi Shankar: పంచభూతాల సాక్షిగా డైరెక్టర్గా మారిన తెలుగు వన్ రవిశంకర్!
-
Russian Ruble: డాలర్కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?