Turkey-Syria Earthquakes: టర్కీ, సిరియాలో 33 వేలు దాటిన భూకంప మృతులు
Turkey-Syria Earthquakes: టర్కీ, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శిథిలాల తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 33 వేల మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. టర్కీలో 29,605 మంది, సిరియాలో 3,574 మంది మరణించినట్లు తెలిపారు. పరిస్థితి చూస్తుంటే ఈ సంఖ్య 50 వేలకు పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి అధికారులు అంచనా వేస్తున్నారు.టర్కీ, సిరియా భూకంపం ప్రాంతాల్లో సహాయక చర్యలు ఏడో రోజూ కొనసాగాయి. శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారులు సహా అనేక మందిని సహాయక బృందాలు రక్షించాయి. దక్షిణ టర్కీ హతాయ్ ప్రావిన్స్లో శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తిని 149 గంటల తర్వాత బయటకు తీశారు.
మరోవైపు టర్కీ దేశస్థులు తమ దేశంలోని బంధువుల ఇంట్లో తాత్కాలికంగా తలదాచుకోవచ్చని జర్మనీ తెలిపింది. ఈ విపత్కర పరిస్థితిలో తమవంతు సాయం అందిస్తామని చెప్పింది. ఇతర దేశాలు కూడా టర్కీకి ఆపన్నహస్తం అందిస్తున్నాయి. చైనా 53 టన్నుల టెంట్లను సాయంగా అందించింది. భారత్ ఇప్పటికే సహాయక బృందాలతో పాటు వైద్య బృందాలు, ఔషధాలు, ఇతర సామగ్రిని టర్కీకి పంపింది. సిరియా భూకంపంలో దెబ్బతిన్న ప్రాంతాలకు అవసరమైన సహాయాన్ని పొందడంలో విఫలమైందని ఐక్యరాజ్యసమితి ఆదివారం పేర్కొంది. వాయువ్య సిరియాకు సామాగ్రితో కూడిన యూఎన్ కాన్వాయ్ టర్కీ మీదుగా చేరుకుంది. అయితే లక్షలాది మంది ఇళ్లు ధ్వంసమయ్యాయని, వారికి ఇంకా చాలా అవసరమని ఏజెన్సీ సహాయ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్స్ చెప్పారు.
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
ఓ వైపు భూకంప బాధితుల్ని తుర్కియే ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే.. మరోవైపు దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. మృతదేహాలు, క్షతగాత్రుల వద్ద నుంచి నగలు, నగదు దోచుకుంటున్నారు. బాధితులను దోచుకోవడం లేదా మోసం చేయడానికి ప్రయత్నించినందుకు డజన్ల కొద్దీ మందిని అరెస్టు చేసినట్లు రాష్ట్ర మీడియా తెలిపింది. ఓ వైపు సహాయక చర్యలు జరుగుతుండగా మరోవైపు దొంగలు మృతదేహాల వద్ద ఆభరణాలు, నగదు దోచుకుంటున్నారు. దుకాణాల్లో చొరబడి దొరికింది దొరికినట్లు ఎత్తుకెళ్తున్నారు. మరికొందరు భూకంపం బాధితుల్ని ఆదుకుంటామని చెబుతూ మోసం చేస్తున్నారు. ఈ విషయంపై దృష్టి సారించిన టర్కీ పోలీసులు 48 మందిని అరెస్టు చేశారు. హటే ప్రావిన్స్లో దోపిడీలకు పాల్పడిన 42 మందిని, గజియాటెంప్లో ఆరుగురు మోసగాళ్లను అదుపులోకి తీసుకున్నారు.
Student Drowns In Ganga: విషాదం.. గంగానదిలో మునిగి ఐఐటీ విద్యార్థి మృతి
టర్కీ, సిరియా అంతటా కనీసం 870,000 మందికి అత్యవసరంగా భోజనం అవసరమని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఒక్క సిరియాలోనే దాదాపు 5.3 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాదాపు 26 మిలియన్ల మంది ప్రజలు భూకంపం వల్ల ప్రభావితమయ్యారు. డజన్ల కొద్దీ ఆసుపత్రులు దెబ్బతిన్న తరువాత తక్షణ ఆరోగ్య అవసరాలను ఎదుర్కోవటానికి 42.8 మిలియన్ డాలర్లు కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) శనివారం విజ్ఞప్తి చేసింది. టర్కీకి చెందిన విపత్తు ఏజెన్సీ 8,294 మంది అంతర్జాతీయ రక్షకులతో పాటు టర్కీ సంస్థల నుండి 32,000 మందికి పైగా శోధన, రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగించే పని చేస్తున్నారని చెప్పారు. కానీ, చాలా ప్రాంతాలలో, రెస్క్యూ టీమ్లు తమకు సెన్సార్లు, ఇతర అధునాతన శోధన పరికరాలు లేవని చెప్పారు. అంటే వారు తరచుగా పారలతో లేదా వారి చేతులతో ధ్వంసమైన భవనాలను జాగ్రత్తగా తవ్వుతున్నారు. ఇజ్రాయెల్ అత్యవసర సహాయ సంస్థ ఆదివారం టర్కీలో భూకంప సహాయక చర్యలను నిలిపివేసినట్లు తెలిపింది. ఆ దేశ సిబ్బందికి ముఖ్యమైన భద్రతా ముప్పు కారణంగా స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు.
భూకంపం కారణంగా 12,141 భవనాలు ధ్వంసమయ్యాయని లేదా తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. గత సోమవారం 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా టర్కీలో 29,605 మంది, సిరియాలో 3,574 మంది మరణించారని, ధృవీకరించబడిన మృతుల సంఖ్య మొత్తం 33,179కి చేరుకుందని అధికారులు, వైద్యులు తెలిపారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!