Kerala News: కేరళ ఘటనలో 30కి చేరిన మరణాల సంఖ్య..సీఎంకి మోడీ ఫోన్
- వాయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలో విరిగిపడిన కొండచరియలు
- వందలాది మంది చిక్కుకున్నట్లు సమాచారం
- క్రమంగా పెరుగుతున్న మరణాల సంఖ్య
- ఇప్పటి వరకు 30కి చేరిన మరణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ వర్షాల మధ్య కేరళలోని వాయనాడ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇందులో 100 మందికి పైగా చిక్కుకుపోయారు. ప్రజలను రక్షించేందుకు భారీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడినట్లు సమాచారం. దీని తర్వాత తెల్లవారుజామున 4.10 గంటల ప్రాంతంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. అందులో చిక్కుకుపోయిన జనాలను బయటకు తీసుకురావడానికి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
READ MORE: Charminar Clock: 135 ఏళ్ల ఘన చరిత్ర.. చారిత్రాత్మక చార్మినార్ గడియారం ధ్వంసం..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఇప్పటివరకు 30 మంది మరణించారు. వీరిలో ముగ్గురు చిన్నారులతో పాటు ఓ ఫారినర్ ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సహాయక బృందాలు అన్వేషిస్తున్నాయి. కాగా నాలుగు గంటల వ్యవధిలోనే 3 సార్లు కొండచరియలు విరిగి పడటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేరళ సీఎం విజయన్ తో ప్రదాని మోడీ ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు.. అవసరమైన అన్ని సహాయాలు కేంద్రం చేస్తుందన్నారు. ముండక్కై, చూరల్మల, అత్తమాల, నూల్పుజా గ్రామాలు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలలో ఉన్నాయని అధికారులు తెలిపారు.
READ MORE:Credit Card New Rules :హెచ్డీఎఫ్సీ కార్డ్ హోల్డర్ బ్యాడ్ న్యూస్..ఆగస్టు నుంచి అదనపు ఛార్జీలు
నేషనల్ హెల్త్ మిషన్ ఇక్కడ కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్లైన్ నంబర్లు 9656938689.. 8086010833 కూడా జారీ చేయబడ్డాయి. తమిళనాడులోని సూలూరు నుంచి ఉదయం 7.30 గంటలకు ఎయిర్ఫోర్స్కు చెందిన హెలికాప్టర్లు Mi-17, ఒక ALH ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
READ MORE:Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్ 2024.. చరిత్రకు అడుగు దూరంలో మను బాకర్!
ఆర్మీ బృందాన్ని మోహరించారు..
ప్రమాదం యొక్క పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆర్మీ రంగంలోకి దిగింది. నాలుగు బృందాలను సమీకరించారు. వీటిలో 122 ఇన్ఫాంట్రీ బెటాలియన్ (టెరిటోరియల్ ఆర్మీ) రెండు కాంటెంజెంట్లు, కన్నూర్లోని డీఎస్సీ సెంటర్కు చెందిన రెండు కంటెంజెంట్లు ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇప్పటివరకు మోహరించిన మొత్తం దళాల సంఖ్య 225, ఇందులో వైద్య సిబ్బంది కూడా ఉన్నారు.
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… డిలీటెడ్ సీన్లన్నీ ఇక్కడ చూడొచ్చు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
-
Astrology: కెరీర్లో నెమ్మదిగా ఎదిగినా.. చివరికి పెద్ద స్థాయికి చేరుకునే 3 రాశులు ఇవేనా?
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!