Kerala News: కేరళ ఘటనలో 30కి చేరిన మరణాల సంఖ్య..సీఎంకి మోడీ ఫోన్
- వాయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలో విరిగిపడిన కొండచరియలు
- వందలాది మంది చిక్కుకున్నట్లు సమాచారం
- క్రమంగా పెరుగుతున్న మరణాల సంఖ్య
- ఇప్పటి వరకు 30కి చేరిన మరణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ వర్షాల మధ్య కేరళలోని వాయనాడ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇందులో 100 మందికి పైగా చిక్కుకుపోయారు. ప్రజలను రక్షించేందుకు భారీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడినట్లు సమాచారం. దీని తర్వాత తెల్లవారుజామున 4.10 గంటల ప్రాంతంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. అందులో చిక్కుకుపోయిన జనాలను బయటకు తీసుకురావడానికి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
READ MORE: Charminar Clock: 135 ఏళ్ల ఘన చరిత్ర.. చారిత్రాత్మక చార్మినార్ గడియారం ధ్వంసం..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఇప్పటివరకు 30 మంది మరణించారు. వీరిలో ముగ్గురు చిన్నారులతో పాటు ఓ ఫారినర్ ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సహాయక బృందాలు అన్వేషిస్తున్నాయి. కాగా నాలుగు గంటల వ్యవధిలోనే 3 సార్లు కొండచరియలు విరిగి పడటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేరళ సీఎం విజయన్ తో ప్రదాని మోడీ ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు.. అవసరమైన అన్ని సహాయాలు కేంద్రం చేస్తుందన్నారు. ముండక్కై, చూరల్మల, అత్తమాల, నూల్పుజా గ్రామాలు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలలో ఉన్నాయని అధికారులు తెలిపారు.
READ MORE:Credit Card New Rules :హెచ్డీఎఫ్సీ కార్డ్ హోల్డర్ బ్యాడ్ న్యూస్..ఆగస్టు నుంచి అదనపు ఛార్జీలు
నేషనల్ హెల్త్ మిషన్ ఇక్కడ కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్లైన్ నంబర్లు 9656938689.. 8086010833 కూడా జారీ చేయబడ్డాయి. తమిళనాడులోని సూలూరు నుంచి ఉదయం 7.30 గంటలకు ఎయిర్ఫోర్స్కు చెందిన హెలికాప్టర్లు Mi-17, ఒక ALH ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
READ MORE:Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్ 2024.. చరిత్రకు అడుగు దూరంలో మను బాకర్!
ఆర్మీ బృందాన్ని మోహరించారు..
ప్రమాదం యొక్క పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆర్మీ రంగంలోకి దిగింది. నాలుగు బృందాలను సమీకరించారు. వీటిలో 122 ఇన్ఫాంట్రీ బెటాలియన్ (టెరిటోరియల్ ఆర్మీ) రెండు కాంటెంజెంట్లు, కన్నూర్లోని డీఎస్సీ సెంటర్కు చెందిన రెండు కంటెంజెంట్లు ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇప్పటివరకు మోహరించిన మొత్తం దళాల సంఖ్య 225, ఇందులో వైద్య సిబ్బంది కూడా ఉన్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!