DCP Rashmi Perumal : టవర్లకు ఉండే రేడియో రిమోట్ యూనిట్లు, హెడ్స్ చోరీ.. నిందితులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలోని సెల్ఫోన్ టవర్లపై పరికరాలను చోరీ చేస్తున్న నిందితుల అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాళ్ మీడియా తెలిపారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టవర్లకు ఉండే రేడియో రిమోట్ యూనిట్లు, హెడ్స్ చోరీ చేస్తున్నారని, ఈ పరికరాలు మొబైల్ టవర్స్ లో వాడతారు.. మొబైల్ సిగ్నల్స్ అందడానికి ఈ పరికరాలు అత్యవసరమని ఆమె తెలిపారు. అయితే.. సౌత్ జోన్ టాస్క్ఫోర్స్, కాచిగూడ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. నిందితుల నుంచి 60 నుండి 70 లక్షల విలువ చేసే పరికరాలు స్వాధీనం చేసుకున్నామని ఆమె తెలిపారు.
అంతేకాకుండా..’రెగ్యులర్గా టవర్ల కు సంబంధించిన పరికరాలు చోరీ అవుతున్నాయని ఫిర్యాదులు అందాయి. దీంతో నిఘా పెట్టాం… టవర్ల పరికరాలను ఇన్స్టాల్ చేసే వారే ఈ చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించాము.. సాధారణ వ్యక్తులు టవర్లకు ఈ పరికరాలను సెట్ చేయలేరు.. అలాగే రిమూవ్ చేయలేరు. ఇన్స్టాల్ చేయడానికి నాలెడ్జ్ ఉన్నవారే ఈ చోరీలకు పాల్పడ్డారు.. టవర్లలో ఈ పరికరాలను పిలుస్తాం చేయడానికి అనుభవం ఉన్న వారిని సెల్యులార్ కంపెనీలు హైర్ చేసుకుంటాయి.. ఇలా సెల్యూలర్ కంపెనీలో నిందితులు తొమ్మిది మంది పనిచేస్తున్నారు. టవర్లకు పరికరాలు ఇన్స్టాల్ చేసిన మరుసటి రోజు వేరే వచ్చి ఆ పరికరాలను దొంగిలిస్తారు. టవర్లకు చెందిన పరికరాలు చోరీ చేయడంలో నాగరాజు, నగేష్ ప్రధాన నిందితులు కాక మరో ఐదుగురు రిసీవర్లు ఉన్నారు..
Also Read
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
- Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
ఇలా చోరీ చేసిన ఈ పరికరాలను ఢిల్లీలోని రిసీవర్లకు పంపుతారు. ఢిల్లీలో 500 రిసీవర్లు ఉన్నారు… చోరీ చేసిన సెల్యూలర్ కంపెనీ పరికరాలు దేశంలో వాడితే ఆయా సెల్లులార్ కంపెనీలు ఐడెంటిఫై చేస్తారు.. దీంతో చోరీ చేసిన పరికరాలను విదేశాలకు వివిధ మార్గాల్లో పంపుతున్నారు. చోరీ చేసిన పరికరాలను ఒక్కొక్కటి మూడు లక్షల వరకు విక్రయిస్తున్నారు. నిందితులు చాలాకాలంగా ఈ చోరీలకు పాల్పడుతున్నారు.. జియో టవర్లకు చెందిన పరికరాలను చైతన్య, రవి నాయక్ అనే వ్యక్తులు చోరీ చేశారు..’ అని డీసీపీ రేష్మి పెరుమాళ్ తెలిపారు.
తాజావార్తలు
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!