DCP KantiLal Subhash : ఈజీ మనీకోసం గంజాయి పెడ్లర్గా అవతారం ఎత్తాడు
- హైదరాబాద్ చాదర్ఘాట్లో అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్ అరెస్ట్
- నిందితుడిని ఆరెస్ట్ చేసిన సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు
- అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్ రాజు వద్ద నుండి 62 కేజీ ల గంజాయి సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DCP KantiLal Subhash : హైదరాబాద్ చాదర్ఘాట్లో అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్ను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్ రాజు వద్ద నుండి 62 కేజీ ల గంజాయి సీజ్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా సౌత్ ఈస్ట్ డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ మాట్లాడుతూ… అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్ రాజును పట్టుకున్నామని తెలిపారు. గాజువాక చెందిన రాజు ఐస్ క్రీమ్ బిజినెస్ చేస్తున్నాడని, ఈజీ మనీకోసం రాజు గంజాయి పెడ్లర్ గా అవతారం ఎత్తాడన్నారు. మహారాష్ట్ర చంద్రాపూర్ లో మకాం మార్చాడని, చంద్రపూర్ లో పురుషోత్తం అనే వ్యక్తికి ఆర్డర్ పై ఇచ్చేందుకు గంజాయి తీసుకెళ్తున్నాడన్నారు. ఒరిస్సాకు చెందిన సుభాష్ అనే వ్యక్తి వద్ద విక్రయించి తరలిస్తుండగా మాకు సమాచారం రావడంతో పట్టుకున్నామని డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ పేర్కొన్నారు. గంజాయిని తోలుతా ఒరిస్సా నుండి రామగుండం తీసుకవచ్చి అక్కడి నుండి బసు లో హైదరాబాద్ చేరుకున్నాడని, హైదరాబాద్ నుండి చంద్రాపూర్ వెళ్లేందుకు బస్ కోసం చాదర్ ఘాట్ నల్గొండ చౌరస్తాలో అగి ఉన్నాడన్నారు.
Bhumana Karunakar Reddy: టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు..
Also Read
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో గంజాయి తరలిస్తున్న రాజు అదుపులోకి తీసుకున్నామన్నారు. రాజు ఈజీ మనీ కోసం గంజాయి సరఫరా చేస్తున్నాడని, గతంలో గంజాయి సరఫరా చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తెలంగాణాలోని పాల్వంచ పోలీస్ స్టేషన్లలో ఇతనిపై పలు కేసు లు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. గతంలో వరుస గంజాయి కేసులలో జైలుకు వెళ్లిన రాజు తన బుద్ధి మాత్రం మారలేదన్నారు. గంజాయి పెడ్లర్ రాజు కాల్ డేటా, రిసీవర్లు ఎవరు. మెయిన్ పేడ్లర్ ఎంత మంది. సబ్ పెడ్లర్లు ఎవరు విరి నెట్ వర్క్ పై వివిధ కోణాల్లో9 విచారణ జరుపుతున్నామని డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ తెలిపారు.
Uttam Kumar Reddy : సర్వమత సమ్మేళనానికి ప్రతీక జాన్ పహాడ్ దర్గా ఉర్సు
తాజావార్తలు
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?