DCP Dharavath Janaki : డబ్బుల కోసమే బాలుడి కిడ్నాప్.. 36 గంటల్లోపు కిడ్నాప్ కేసు ఛేదించాం
నేరేడుమెట్లో జరిగిన బాలుడు కిడ్నాప్ కేసుని పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా నేరేడ్మెట్ సీపీ కార్యాలయంలో మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 15న బాలుడి కిడ్నాప్ కేసు నమోదు చేశామని, కాలనీలో ఆడుకోడానికి వెళ్లిన బాలుడు ఇంటికి రాలేదన్నారు. దీంతో బాలుడి తల్లదండ్రులు మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారన్నారు. ప్రకాశం, శ్రీశైలం, పాలకుర్తి, వరంగల్కు పోలీస్ టీం పంపామని, అయితే.. పోలీస్ కేసు వాపసు తీసుకోమని వాట్సాప్ ద్వారా పేరెంట్స్కి ఓ కాల్ వచ్చిందన్నారు. కిడ్నాపర్ల నుండి మరోసారి పేరెంట్స్ కి సాయంత్రం వాట్సాప్ కాల్ వచ్చిందని, పేరెంట్స్ వాట్స్ అప్ కాల్ ద్వారా బాబును చూపించాలని వేడుకున్నారన్నారు. ఈ క్రమంలో.. ఓకే కాలనీలో ఉండే వాళ్లే బాబుని కిడ్నాప్ చేశారని గుర్తించామని, రవి అనే కిడ్నాపర్ అదుపులోకి తీసుకొని విచారణ చేసామన్నారు. డబ్బుల కోసం బాబును కిడ్నాప్ చేసారని, రవి, శివ నెల రోజులుగా కిడ్నాప్ ప్లాన్ చేశారని ఆమె వెల్లడించారు.
Also Read : NSA Ajit Doval: సుభాష్ చంద్రబోస్ బతికి ఉంటే భారతదేశం విడిపోయేది కాదు..
Also Read
- West Bengal Elections: మమతా బెనర్జీ నియోజకవర్గంలో మరో గందరగోళం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా అవుట్ చేయాలి.. చాట్ జీపీటీ సమాధానం మైండ్ బ్లోయింగ్..
- AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..
- Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత - నాగచైతన్య.. అది కూడా పార్ట్నర్స్తో!
అంతేకాకుండా.. ‘రవి, శివ అనే ఇద్దరు నిందితులు అన్ లైన్ ట్రేడింగ్లో నష్టపోవడంతో బాబును కిడ్నాప్ చేశారు. 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేసారు ప్లాన్ చేశారు. బాలుడుని క్రికెట్ బాల్ ఇప్పిస్తామని చెప్పి కిడ్నాప్ చేశారు. ఈ కేసులో ఓ మైనర్ జువైనల్ బాలుడు హస్తం ఉంది. తార్నాక వరకు వచ్చి మైనర్ జువైనల్ బాలుడు ఇంటికి వెళ్లిపోయాడు. రవి అనే మెయిన్ కిడ్నాపర్ డిజిటల్ సిమ్ ద్వారా కిడ్నాప్ ఒడిగట్టాడు. బాలుడుతో రవి అనే కిడ్నాపర్ డిజిటల్ ఫోన్ లో టచ్ లోనే ఉన్నాడు. మొత్తం 8 బృందాలుగా ఏర్పడి కిడ్నాప్ కేస్ దర్యాప్తు జరిపాం. 36గంటల్లోపు కిడ్నాప్ కేసు ఛాలెంజ్ గా తీసుకొని ఛేదించాము. ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరా ఎవిడెన్స్ కీలకం అయింది. కార్ లో బాలుడిని కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసాం. బాలుడ్ని తీసుకొని పారిపోతున్న కిడ్నాపర్ లను పట్టుకున్నాము. జనగాం జిల్లా కొడకండ్ల మండలం రామన్నగూడెం గ్రామ రోడ్ పై కిడ్నాపర్ల ముఠా పటుకున్నాం. నిందితులపై ఐపీసీ సెక్షన్ 366 కిడ్నాప్ కేస్ నమోదు చేశాం’ అని డీసీపీ వెల్లడించారు.
Also Read : Hyundai Creta Price 2023: కేవలం 8 లక్షలకే హ్యుందాయ్ క్రెటా.. రోడ్ టాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు!
అనంతరం బాలుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. కిడ్నాపర్ల చెర నుండి మా బాబును కాపాడిన పోలీస్ వారికి ధన్యవాదాలు.. కిడ్నాపర్లు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పోలీస్ లకు చెప్తే బాబుని చంపేస్తాము అని బెదిరించారు.. భారీగా డబ్బు డిమాండ్ చేశారు.. కంప్లైంట్ ఇస్తే బాబును చంపేస్తాము అన్నారు.. మా పక్కింటివాళ్లే ఇలా చేస్తారు అనుకోలేదు.. 1989 నుండి హైద్రాబాద్ లో ఉన్నాను.. నాకు, నా కుటుంబానికి శత్రువులు ఎవ్వరు లేరు.. ఎన్టీవీ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. ఎన్టీవీలో కిడ్నాప్ వార్త ప్రసారాల ద్వారా పోలీసు యంత్రాంగం అలెర్ట్ అయ్యారు. మా బాబు సేఫ్ గా మా చెంత చేరాడు.’ అని అన్నారు.
తాజావార్తలు
-
Rajasthan Royals Owner: రాజస్థాన్ రాయల్స్ కొత్త ఓనర్గా బిలియనీర్ లక్ష్మీ మిట్టల్.. రూ.15,660 కోట్లతో డీల్!
-
Sundar C: రజనీ, కమల్ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా.. డైరెక్టర్ సుందర్ సి సంచలన వ్యాఖ్యలు!
-
Blood Shortage: సమ్మర్లో బ్లడ్ బ్యాంకులకు గడ్డు పరిస్థితి
-
Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
-
West Bengal Elections: మమతా బెనర్జీ నియోజకవర్గంలో మరో గందరగోళం..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!