IND vs NZ: మూడో రోజు ముగిసిన ఆట.. రాణించిన కోహ్లీ, సర్ఫరాజ్
- మూడో రోజు ముగిసిన ఆట
- ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో భారత్ స్కోరు 231/3
- 125 పరుగుల వెనుకంజలో భారత్
- రాణించిన కోహ్లీ 70.. సర్ఫరాజ్ (70*).
- Follow Us :
-
-
Add as a preferred
source on google
3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా.. భారత్-న్యూజిలాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతోంది. తొలి టెస్టులో భారత్ ఎదురొడ్డుతుంది. కాగా.. నేడు మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్ 125 పరుగుల వెనుకంజలో ఉంది. భారత్ రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. కోహ్లీ (70), సర్ఫరాజ్ (70*) ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీతో రాణించాడు. జైస్వాల్ (35) పరుగులు చేశాడు. మూడో రోజు ఆట ముగుస్తుందనగా.. అప్పటి వరకూ నిలకడగా ఆడిన విరాట్ కోహ్లీ ఔటయ్యాడు.
Read Also: Deepavali: దీపావళి రిలీజ్ సినిమాలు ముందు రోజుకు షిఫ్ట్.. ఎందుకంటే?
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. 402 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత్ ముందు 356 పరుగుల భారీ ఆధిక్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో.. రెండో ఇన్నింగ్స్ లో భారత్ శుభారంభం చేసింది. రోహిత్, యశస్వి మధ్య తొలి వికెట్కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 52 బంతుల్లో 35 పరుగులు చేసి యశస్వి ఔటయ్యాడు. 63 బంతుల్లో 52 పరుగులు చేసి కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ మధ్య సెంచరీ భాగస్వామ్యం నెలకొంది. కోహ్లి 102 బంతుల్లో 70 పరుగులు చేసి పెవిలియన్కు చేరుకున్నాడు. సర్ఫరాజ్ 78 బంతుల్లో 70 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.
Read Also: Israel-Lebanon War: భారత్ దాతృత్వం.. లెబనాన్కు ఇండియా భారీ సహాయం..
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!