Dawood Ibrahim: ఎట్టకేలకు అమ్ముడైన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఆస్తులు.. దక్కించుకున్నది ఎవరో తెలుసా?
Dawood Ibrahim: దశాబ్దాల నిరీక్షణ తర్వాత, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన పూర్వీకుల ఆస్తుల వేలం ప్రక్రియ ఎట్టకేలకు విజయవంతమైంది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉన్న దావూద్ కుటుంబానికి చెందిన నాలుగు వ్యవసాయ ప్లాట్లను ముంబైకి చెందిన ఒక వ్యక్తి అత్యధిక బిడ్తో దక్కించుకున్నారని అధికారులు తెలిపారు.
READ ALSO: Netanyahu: ఇరాన్ అణుశక్తిని నాశనం చేశాం.. పుకార్ల మధ్య నెతన్యాహు ప్రెస్మీట్
Also Read
- Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్రూట్ పులావ్ తయారు చేయండిలా..
వేలం వివరాలు ఇవే..
రత్నగిరి జిల్లాలోని ముంబాక్ గ్రామంలో ఉన్న ఈ నాలుగు భూములు గతంలో దావూద్ తల్లి అమీనా బీ పేరు మీద నమోదై ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘స్మగ్లర్లు & విదేశీ మారక ద్రవ్య మానిప్యులేటర్ల (ఆస్తి జప్తు) చట్టం’ కింద 2026 మార్చి 5న ఈ వేలాన్ని నిర్వహించింది. అత్యధిక బిడ్ వేసిన వ్యక్తి 2026 ఏప్రిల్ మొదటి వారం నాటికి పూర్తి మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నిధుల జమ అనంతరం, సంబంధిత అధికారుల నుంచి తుది ఆమోదం పొందిన తర్వాతే ఆస్తి బదిలీ ప్రక్రియ పూర్తవుతుంది.
ముంబాక్ ప్లాట్లపై ఆసక్తి
ఈ వేలంలో ప్రధానంగా సర్వే నెం. 442 (పార్ట్ 13-బి) ప్లాట్ గురించి ఆసక్తికర చర్చ నడిచింది. దీని రిజర్వ్ ధర సుమారు రూ.9.41 లక్షలుగా నిర్ణయించగా, వేలంలో ఇది రూ.10 లక్షల మార్కును దాటింది. ఈ ప్లాట్ కోసం ముంబై, రత్నగిరి నుంచి ఇద్దరు బిడ్డర్లు పోటీ పడగా, మిగిలిన మూడు ప్లాట్లను ఒకే బిడ్డర్ దక్కించుకున్నారు.
ఇన్నాళ్లుగా ఎందుకు అమ్ముడవలేదంటే..
దావూద్ ఆస్తులను వేలం వేయడానికి గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, అవి పదేపదే విఫలమవుతూ వచ్చాయి. దావూద్ ఇబ్రహీం, అతని ముఠా (D-Company) భయంతో కొనుగోలుదారులు ముందుకు రావడానికి వెనుకాడారు. ఇదే సమయంలో గత నవంబర్ (2025)లో ప్రభుత్వం ధరను 30 శాతం తగ్గించినప్పటికీ ఎవరూ ఆసక్తి చూపలేదు. ఈ భూములు గ్రామీణ ప్రాంతాల్లో కేవలం వ్యవసాయానికి మాత్రమే పనికొచ్చేలా ఉండటంతో తక్షణ ఆర్థిక లాభం ఉండదని కొందరు భావించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ, ఎట్టకేలకు ఈ ఆస్తుల వేలం పూర్తి కావడంతో ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
తాజావార్తలు
-
Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
-
Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్
-
CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
-
IPL Rules: బౌలర్లకు న్యాయం కావాలి.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు తప్పనిసరి!
-
Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!