Daggubati Venkateshwara Rao: ఎన్నికల్లో టికెట్లు రాని వారు అదృష్టవంతులు.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Venkateshwara Rao: ఎన్నికలపై సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బుంటేనే ఎన్నికలలో పోటీ చేయాలి అన్నట్లు వ్యవస్థ మారిపోయిందన్నారు. ప్రస్తుత రాజకీయాలు గౌరవప్రదంగా లేవన్నారు. రూ. 30, 40 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినా పెట్టిన డబ్బులు సంపాదించేందుకు ఇప్పుడు అవకాశాలు లేవన్నారు. ఇంతకు ముందు పెట్టిన డబ్బులు సంపాదించేందుకు కొంత అవకాశం ఉండేదన్నారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోందని.. పార్టీ అధిపతి, ఎమ్మెల్యేలను ఎంపీలను ఉత్సవ విగ్రహాలుగా చేశారని వ్యాఖ్యానించారు. ఇసుక, మద్యం, మైనింగ్లలో లక్షల కోట్లను దోచుకుంటున్నారని.. భారతదేశంలో సింగిల్ మేన్ పార్టీలు మొత్తం ఇలాగే ఉన్నాయన్నారు.
Read Also: Andhrapradesh: మున్సిపల్ కార్మిక సంఘాలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
గతంలో ఎమ్మెల్యేలు ఊరికి మంచి సేవ చేసి గౌరవప్రదంగా ఉండేవారని.. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. గెలిచిన తర్వాత రాజకీయాలకు ఎందుకు వచ్చామా అని ఎమ్మెల్యేలు, ఎంపీలు తలబాదుకుంటున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఎవరికైతే టికెట్లు రావో వారు అదృష్టవంతులంటూ ఆయన అన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకుని టికెట్ రాకుంటే కనీసం వాళ్లకు 30 కోట్లు 40 కోట్లు మిగిలినట్టేనన్నారు. వాళ్ల జీవితంలో సంపాదించుకున్న డబ్బులను వృధాగా ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నారు.ఇప్పుడు ఎమ్మెల్యేలు సంపాదించుకున్నది మొత్తం ఓ చోట ఖజానాకే చేరుతుందన్నారు. ఓడిన వాడు అక్కడే ఏడుస్తాడు.. గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడుస్తాడన్నారు. నిజమైన ప్రజాప్రతినిధులను భగవంతుడు కాపాడాలని కోరుకుంటున్నానన్నారు. రానున్న ఎన్నికలలో తాను, తన కుమారుడు హితేష్ పోటీ చేయడం లేదని ఇటీవల అందుకే మరోసారి చెప్పామన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!