Daggubati Purandeswari: వైసీపీ, కాంగ్రెస్, టీడీపీకి చెప్పేది ఒక్కటే.. తప్పులు చేసేది మీరు.. మాపై విమర్శలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari: వైసీపీ, కాంగ్రెస్, టీడీపీకి మేం చెప్పేది ఒక్కటే.. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగారు.. తప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు, నాయకులు చేసి బీజేపీపై విమర్శలు చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏక కాలంలో 25 పార్లమెంట్ బీజేపీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం ఒక సువర్ణ అధ్యాయం అన్నారు. 2024 ఎన్నికల నగారా మోగించాం.. కార్యకర్తలను గౌరవించుకునే పార్టీ బిజెపి.. ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో మొదలయ్యి.. 1,300 ప్రాంతీయ, 7 జాతీయ పార్టీల కంటే బీజేపీ భిన్నమైంది.. అధికారంలోకి రాలేము అనుకున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో విజయాన్ని బీజేపీ నమోదు చేసింది.. బీజేపీ అధికారంలోకి రాక ముందు దేశంలో స్కాంలు మాత్రమే ఉండేవి.. బీజేపీ అధికారంలో వచ్చాక పేదల సంక్షేమం కోసం స్కీమ్లు తీసుకువచ్చారని తెలిపారు.
Read Also: Nallapareddy Prasanna Kumar Reddy: డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం ఫ్యాన్కు వేయండి..
Also Read
ఇక, బీజేపీ అధికారంలో వచ్చిన 10 ఏళ్ల కాలంలో అవినీతి లేని పాలన అందించాం.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ 350 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారని తెలిపారు పురంధేశ్వరి.. ఆంధ్ర రాష్ట్రంలో విద్వేష, విధ్వంసకర పాలన కొనసాగుతుందన్నారు. ఏపీలో గుళ్లు, గుళ్లల్లో విగ్రహాలను కూలగొడుతుంది.. రాష్ట్రంలో నియంతృత్వ పాలనలో గళంవిప్పిన వారిపై దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సామాజిక సాధికార యాత్ర చేసే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు.. బాపట్లలో అక్కని కాపాడుకుందామని వెళ్లిన బీసీ కులానికి చెందిన చిన్న బిడ్డను కాల్చి చంపారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. తలకాయ లేని మొండెంలా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని ఉంచారని దుయ్యబట్టారు. అమరావతి రాజధాని అని కేంద్రం భావించి నిధులు, రోడ్లు మంజూరు చేసిన ఘనత బీజేపీకే ఉందన్నారు.
Read Also: Budget-2024: వందే భారత్ కోచ్ల తరహాలో కొత్తగా 40 వేల బోగీలు
పోలవరం జాతీయ హోదా కల్పించిన తర్వాత ప్రతి రూపాయి కేంద్రమే ఖర్చు చేస్తోందన్నారు పురంధేశ్వరి.. టీడీపీ హయాంలో ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం జరిగినా కాంట్రాక్టర్ ను తొలగించకుండా జాప్యం చేసిందన్నారు.. వైసీపీకి, కాంగ్రెస్, టీడీపీకి మేం చెప్పేది ఒక్కటే.. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగారు.. తప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు, నాయకులు చేసి బీజేపీపై విమర్శలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
తాజావార్తలు
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
-
Satyadev : మహేష్ బాబు వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది: హీరో సత్యదేవ్ ఎమోషనల్!
-
Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
-
SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
-
IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!