Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- రాజస్థాన్ను కుదిపేస్తోన్న బాలికపై అత్యాచార ఘటన
- 30 మందికి పైగా అత్యాచారం
- 4 హోటళ్లు ధ్వంసం చేసిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని శ్రీగంగానగర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో బాధిత బాలికపై ఐదు రోజుల పాటు 30 మందికి పైగా వ్యక్తులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఘటనపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్కు దిగింది. కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగు హోటళ్లను బుల్డోజర్లతో కూల్చివేసింది. నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హరిశంకర్ హామీ ఇచ్చారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జూన్ 18న ఇంటి నుంచి అదృశ్యమైన బాలికను ఓ ఆటోరిక్షా డ్రైవర్ స్థానిక హోటల్ యజమానికి విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం ఐదు రోజుల పాటు నగరంలోని పలు హోటళ్లకు తరలిస్తూ 30 మందికి పైగా వ్యక్తులు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. పలువురు హోటల్ యజమానులు, నిర్వాహకులు కూడా ఈ ఘోరానికి సహకరించడమే కాకుండా.. జరిగిన నేరాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలంలో.. నొప్పితో ఏడుస్తుంటే తనకు బలవంతంగా మద్యం తాగించేవారని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
ప్రజల్లో ఆగ్రహం.. ఉరిశిక్ష డిమాండ్
ఈ అమానుష ఘటనపై శ్రీగంగానగర్ జిల్లాలో భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. నిందితులకు ఉరిశిక్ష విధించాలని, అక్రమంగా నిర్మించిన హోటళ్లన్నింటినీ కూల్చివేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. మరోవైపు స్థానిక కాంగ్రెస్ పార్టీ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టి.. ఈ ఘటనను అడ్డుకోవడంలో పరిపాలన విఫలమైందని ఆరోపించింది. కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!
-
Astrology: జూలై 23 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..!
-
Samsung Galaxy Z Flip 8: 4300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!