Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- రాజస్థాన్ను కుదిపేస్తోన్న బాలికపై అత్యాచార ఘటన
- 30 మందికి పైగా అత్యాచారం
- 4 హోటళ్లు ధ్వంసం చేసిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని శ్రీగంగానగర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో బాధిత బాలికపై ఐదు రోజుల పాటు 30 మందికి పైగా వ్యక్తులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఘటనపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్కు దిగింది. కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగు హోటళ్లను బుల్డోజర్లతో కూల్చివేసింది. నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హరిశంకర్ హామీ ఇచ్చారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జూన్ 18న ఇంటి నుంచి అదృశ్యమైన బాలికను ఓ ఆటోరిక్షా డ్రైవర్ స్థానిక హోటల్ యజమానికి విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం ఐదు రోజుల పాటు నగరంలోని పలు హోటళ్లకు తరలిస్తూ 30 మందికి పైగా వ్యక్తులు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. పలువురు హోటల్ యజమానులు, నిర్వాహకులు కూడా ఈ ఘోరానికి సహకరించడమే కాకుండా.. జరిగిన నేరాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలంలో.. నొప్పితో ఏడుస్తుంటే తనకు బలవంతంగా మద్యం తాగించేవారని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
Also Read
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
ప్రజల్లో ఆగ్రహం.. ఉరిశిక్ష డిమాండ్
ఈ అమానుష ఘటనపై శ్రీగంగానగర్ జిల్లాలో భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. నిందితులకు ఉరిశిక్ష విధించాలని, అక్రమంగా నిర్మించిన హోటళ్లన్నింటినీ కూల్చివేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. మరోవైపు స్థానిక కాంగ్రెస్ పార్టీ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టి.. ఈ ఘటనను అడ్డుకోవడంలో పరిపాలన విఫలమైందని ఆరోపించింది. కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.
తాజావార్తలు
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
-
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
-
Keerthy Suresh: అవకాశాలు లేకనే ఐటం సాంగ్స్.. కీర్తి సురేష్కు నెటిజన్ కౌంటర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నటి!
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!