Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- రాజస్థాన్ను కుదిపేస్తోన్న బాలికపై అత్యాచార ఘటన
- 30 మందికి పైగా అత్యాచారం
- 4 హోటళ్లు ధ్వంసం చేసిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని శ్రీగంగానగర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో బాధిత బాలికపై ఐదు రోజుల పాటు 30 మందికి పైగా వ్యక్తులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఘటనపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్కు దిగింది. కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగు హోటళ్లను బుల్డోజర్లతో కూల్చివేసింది. నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హరిశంకర్ హామీ ఇచ్చారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జూన్ 18న ఇంటి నుంచి అదృశ్యమైన బాలికను ఓ ఆటోరిక్షా డ్రైవర్ స్థానిక హోటల్ యజమానికి విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం ఐదు రోజుల పాటు నగరంలోని పలు హోటళ్లకు తరలిస్తూ 30 మందికి పైగా వ్యక్తులు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. పలువురు హోటల్ యజమానులు, నిర్వాహకులు కూడా ఈ ఘోరానికి సహకరించడమే కాకుండా.. జరిగిన నేరాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలంలో.. నొప్పితో ఏడుస్తుంటే తనకు బలవంతంగా మద్యం తాగించేవారని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
Also Read
- LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
- India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్లో కీలక టెస్ట్..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
ప్రజల్లో ఆగ్రహం.. ఉరిశిక్ష డిమాండ్
ఈ అమానుష ఘటనపై శ్రీగంగానగర్ జిల్లాలో భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. నిందితులకు ఉరిశిక్ష విధించాలని, అక్రమంగా నిర్మించిన హోటళ్లన్నింటినీ కూల్చివేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. మరోవైపు స్థానిక కాంగ్రెస్ పార్టీ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టి.. ఈ ఘటనను అడ్డుకోవడంలో పరిపాలన విఫలమైందని ఆరోపించింది. కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.
తాజావార్తలు
-
LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!