NTV Telugu Site icon

D. Srinivas: అధికారిక లాంఛనాలతో డి. శ్రీనివాస్ అంత్యక్రియలు..

Ds Anthyakriyalu

Ds Anthyakriyalu

ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఆయన పార్ధివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆయన స్వగృహంలో ఉంచారు. మధ్యాహ్నం 2గంటల వరకు అక్కడ ఉంచిన తర్వాత.. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్ కు తరలిస్తారు.

Read Also: KADAPA: బద్వేల్ ఆర్డీఓ అవినీతి చిట్టా అంటూ కరపత్రాలు కలకలం..

రేపు(ఆదివారం)మధ్యాహ్నం డీఎస్ స్వంత నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే.. డి. శ్రీ‌నివాస్ అంత్యక్రియలు అధికారిక లాంఛ‌నాల‌తో నిర్వహించనున్నారు. డీఎస్కు అధికారిక లాంఛ‌నాల‌తో అంత్యక్రియ‌ల‌కు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీఎస్‌ శాంతికుమారిని ఆదేశించారు. మరోవైపు.. తన రిక్వెస్ట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Read Also: JDU Meeting : నేడు ఢిల్లీలో జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకోనున్న నితీశ్ కుమార్