KADAPA: కడప జిల్లా బద్వేల్ ఆర్డీఓ ఆకుల వెంకటరమణ అవినీతి చిట్టా అంటూ కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. బద్వేల్ లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు జరిగిన తర్వాత మొదటి ఆర్డీఓగా ఆకుల వెంకటరమణ బాధ్యతలు చేపట్టారు. ఇక, గోపవరం తాహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని 50 లక్షల రూపాయల ముడుపులు తీసుకుని ఇతరులకు దోచి పెట్టారన్న ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి సొమ్ముతో వైజాగ్ లో 10 కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని నిర్మిస్తున్నాడని కరపత్రాల్లో పేర్కొన్న వైనం.
Read Also: Kalki 2898 AD: నార్త్ అమెరికాలో వసూళ్ల సునామి సృష్టించిన “కల్కి”..
గత రెండు సంవత్సరాలలో ఆర్డీఓ ఆకుల వెంకటరమణ 100 కోట్ల రూపాయలు సంపాదించాడని కరపత్రాల్లో ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి ఆర్డీఓను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కోరుతు కరపత్రాలలో పేర్కొన్నారు. గత రెండు రోజులుగా బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్డీఓ వెంకటరమణ గురించి ఇంటిలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఈ నెల 26 నుంచి సెలవుపై ఆర్డీఓ వెంకటరమణ వెళ్లిపోయారు.