Cylinder Blast: సిలిండర్ పేలి కూలిన ఇంటి పైకప్పు.. ఆరుగురు మృతి
- ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం.
- సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశాపురి కాలనీలో సిలిండర్ పేలుడు.
- కూలిన ఇంటి పైకప్పు.
- ఆరుగురు శిథిలాల కింద పడి మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bulandshahr Cylinder Blast: ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశాపురి కాలనీలో సిలిండర్ పేలడంతో ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో కుటుంబానికి చెందిన ఆరుగురు శిథిలాల కింద పడి మృతి చెందారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలీసు పరిపాలన ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. శిథిలాల కింద మహిళలు, చిన్నారులు చిక్కుకుని ఉన్నారని.. వారిని ప్రస్తుతం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సహకారంతో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం.
BRICS Summit 2024: నేటి నుంచి రష్యాలో బ్రిక్స్ సమ్మిట్.. ప్రధాని మోడీతో పుతిన్ కీలక భేటీ
Also Read
- Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
సమాచారం మేరకు సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గులావతి రోడ్డులోని ఆశాపురి కాలనీలోని ఓ ఇంట్లో సోమవారం రాత్రి ఒక్కసారిగా సిలిండర్ పేలుడు సంభవించింది. పేలుడు సంభవించిన వెంటనే, ఇల్లు మొత్తం కుప్పకూలింది. దాంతో ఇంట్లో ఉన్న వ్యక్తులు శిథిలాల కింద సమాధి అయ్యారు. ప్రమాదాన్ని గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి చేరుకుని స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు.
Pottel : ‘పొట్టేల్’ కచ్చితంగా కొట్టేస్తుంది.. సందీప్ రెడ్డి వంగా కాన్ఫిడెంట్!
ఘటన తీవ్రతను గమనించిన ఉన్నతాధికారులు కూడా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యను ముమ్మరం చేశారు. సంఘటనా స్థలానికి జేసీబీ యంత్రాన్ని రప్పించి చెత్తాచెదారాన్ని తొలగించే పనిని వేగంగా ప్రారంభించారు. శిథిలాల నుంచి ఇప్పటి వరకు ఐదు మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద కూరుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. శిథిలాల కింద మహిళలు, చిన్నారులు సమాధి అయ్యారని చెబుతున్నారు. ఘటన తీవ్రతను గమనించిన బులంద్షహర్ జిల్లా మేజిస్ట్రేట్ చంద్రప్రకాశ్ సింగ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. అలాగే రెస్క్యూ ఆపరేషన్ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జిల్లా మేజిస్ట్రేట్ చంద్రప్రకాశ్ సింగ్ తెలిపారు.
#UPDATE | Chandra Prakash Paryadarshi, City Magistrate Bulandshahr says, " Total 6 bodies have come here in the district hospital for post-mortem, 3 male bodies and 3 female bodies. These are the victims of the Sikandrabad tragedy. I can't exactly say the total number of… https://t.co/3IKi4drXve pic.twitter.com/mWzC891fxp
— ANI (@ANI) October 22, 2024
తాజావార్తలు
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..