Cylinder Blast: సిలిండర్ పేలి కూలిన ఇంటి పైకప్పు.. ఆరుగురు మృతి
- ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం.
- సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశాపురి కాలనీలో సిలిండర్ పేలుడు.
- కూలిన ఇంటి పైకప్పు.
- ఆరుగురు శిథిలాల కింద పడి మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bulandshahr Cylinder Blast: ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశాపురి కాలనీలో సిలిండర్ పేలడంతో ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో కుటుంబానికి చెందిన ఆరుగురు శిథిలాల కింద పడి మృతి చెందారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలీసు పరిపాలన ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. శిథిలాల కింద మహిళలు, చిన్నారులు చిక్కుకుని ఉన్నారని.. వారిని ప్రస్తుతం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సహకారంతో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం.
BRICS Summit 2024: నేటి నుంచి రష్యాలో బ్రిక్స్ సమ్మిట్.. ప్రధాని మోడీతో పుతిన్ కీలక భేటీ
Also Read
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
సమాచారం మేరకు సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గులావతి రోడ్డులోని ఆశాపురి కాలనీలోని ఓ ఇంట్లో సోమవారం రాత్రి ఒక్కసారిగా సిలిండర్ పేలుడు సంభవించింది. పేలుడు సంభవించిన వెంటనే, ఇల్లు మొత్తం కుప్పకూలింది. దాంతో ఇంట్లో ఉన్న వ్యక్తులు శిథిలాల కింద సమాధి అయ్యారు. ప్రమాదాన్ని గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి చేరుకుని స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు.
Pottel : ‘పొట్టేల్’ కచ్చితంగా కొట్టేస్తుంది.. సందీప్ రెడ్డి వంగా కాన్ఫిడెంట్!
ఘటన తీవ్రతను గమనించిన ఉన్నతాధికారులు కూడా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యను ముమ్మరం చేశారు. సంఘటనా స్థలానికి జేసీబీ యంత్రాన్ని రప్పించి చెత్తాచెదారాన్ని తొలగించే పనిని వేగంగా ప్రారంభించారు. శిథిలాల నుంచి ఇప్పటి వరకు ఐదు మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద కూరుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. శిథిలాల కింద మహిళలు, చిన్నారులు సమాధి అయ్యారని చెబుతున్నారు. ఘటన తీవ్రతను గమనించిన బులంద్షహర్ జిల్లా మేజిస్ట్రేట్ చంద్రప్రకాశ్ సింగ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. అలాగే రెస్క్యూ ఆపరేషన్ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జిల్లా మేజిస్ట్రేట్ చంద్రప్రకాశ్ సింగ్ తెలిపారు.
#UPDATE | Chandra Prakash Paryadarshi, City Magistrate Bulandshahr says, " Total 6 bodies have come here in the district hospital for post-mortem, 3 male bodies and 3 female bodies. These are the victims of the Sikandrabad tragedy. I can't exactly say the total number of… https://t.co/3IKi4drXve pic.twitter.com/mWzC891fxp
— ANI (@ANI) October 22, 2024
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
-
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!