Cyber Fraud : హైదరాబాద్లో రెండు భారీ సైబర్ నేరాలు
- హైదరాబాద్లో కలకలం రేపుతున్న రెండు భారీ సైబర్ నేరాలు
- ట్రేడింగ్ లాభాలు, డిజిటల్ అరెస్టు పేరుతో మోసం
- రెండు విడతలుగా మొత్తం ₹17.77 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud : హైదరాబాద్లో జరిగిన రెండు భారీ సైబర్ నేరాలు నగరంలో కలకలం రేపాయి. ట్రేడింగ్ లాభాలు, డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు రెండు విడతలుగా మొత్తం ₹17.77 కోట్లు కొల్లగొట్టారు. ఈ సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
ట్రేడింగ్ మోసం: హైదరాబాద్ బంజారాహిల్స్కు చెందిన డాక్టర్ ఒకరు ఫారెక్స్ ట్రేడింగ్లో మోసపోయారు. ఆగస్టులో మిత్తల్ అనే వ్యక్తి ట్రేడింగ్ బిజినెస్ పేరుతో వాట్సాప్లో లింక్ పంపి బాధితుడిని మోసం చేశారు. యూఎస్ డాలర్లలో పెట్టుబడులు పెట్టమని సూచించి, ₹11.11 కోట్లు 34 విడతలుగా బదిలీ చేయించారు. పైగా, విత్డ్రా కోసం ముందస్తు పన్ను చెల్లించాలంటూ మరింత డబ్బు డిమాండ్ చేశారు. అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయటపడింది.
Also Read
Youtube Auto Dubbing Feature: అద్భుతమైన ఫీచర్ను తీసుకొచ్చిన యూట్యూబ్.. ఇకపై ఏ భాషలోనైనా
డిజిటల్ అరెస్టు మోసం: హైదరాబాద్ బషీర్బాగ్కు చెందిన 69 ఏళ్ల వితంతు మహిళని ట్రాయ్ అధికారులమని చెబుతూ మోసం చేశారు. ఆమె ఆధార్ కార్డు కేసులతో సంబంధముందంటూ, డిజిటల్ అరెస్టు పేరుతో ₹5.66 కోట్లు వివిధ దఫాల్లో బదిలీ చేయించారు. నిందితులు సీబీఐ అధికారులమని వీడియో కాల్ ద్వారా మహిళను నమ్మించారు. చివరకు, సీబీఐ కార్యాలయానికి వెళ్లిన బాధితులు తాము మోసపోయామని తెలుసుకున్నారు.
ఈ రెండు ఘటనలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనలు ప్రజలంతా ఆన్లైన్లో జాగ్రత్తగా ఉండాలని గుర్తు చేస్తున్నాయి.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!