Cyber Fraud: సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు కీలక అప్డేట్..
- ఫేక్ లింకులపై జాగ్రత్త
- పార్ట్టైమ్ జాబ్ మోసాలు
- సోషల్ మీడియా ఆఫర్లు మోసమే
- తెలంగాణ పోలీసులు హెచ్చరికలు
Cyber Fraud: సాంకేతిక ప్రగతికి అనుగుణంగా సైబర్ నేరాలు కూడా రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో దాడి చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, అధిక లాభాల పేరుతో ఫేక్ లింకులు పంపుతూ ఫోన్ క్లిక్తోనే ఖాతాల్ని ఖాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఆఫర్ల పేరుతో వచ్చే లింకులను బదులిచ్చే ముందు ఒక్కసారైనా ఆలోచించాలని పోలీసులు సూచిస్తున్నారు. “మీ ఆసక్తి, అవసరాలే మోసగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి. ఇలాంటి లింకులపై క్లిక్ చేయకండి. మోసాల బారి నుంచి మీరే మీను కాపాడుకోవాలి,” అని పలు సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేశారు.
Pahalgam terror attack: ప్రధాని మోడీతో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ..
Also Read
- Fish Price Down: యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన ట్యూనా ఫిష్ ధర..
- AP Govt: ఏపీ ఆర్థిక ప్రగతికి 'నాబార్డ్' ఊతం.. రూ.5.11 లక్షల కోట్లతో భారీ రుణ ప్రణాళిక..
- TVK Vijay: ముఖ్యమంత్రి పదవిపై యాంకర్తో విజయ్ కీలక వ్యాఖ్యలు.. వీడియో వైరల్
- Suvendu Adhikari: రాజీనామా చేయనన్న మమత ప్రకటనపై సువేందు అధికారి ఏమన్నారంటే..!
అంతేకాక, ఇంట్లో నుంచే పనిచేసి డబ్బులు సంపాదించొచ్చన్న పార్ట్టైం ఉద్యోగాల పేరుతో కూడా భారీగా మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో విస్తరిస్తున్న ప్రకటనలపై నమ్మకము పెట్టవద్దని, చిన్న పెట్టుబడితో భారీ లాభాలు అనే వాగ్దానాలు ఎప్పుడూ మోసమేనని వారు తెలిపారు. ఇటీవలి ఉదాహరణగా హన్మకొండ జిల్లాలో చోటుచేసుకున్న ఘటనను చూడొచ్చు. ఉప్పులపల్లి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి ఒక క్రిప్టోకరెన్సీ పెట్టుబడి లింకులో మోసపోయాడు. మొదట రూ.1,000 పంపించి నమ్మకం కలిగించి, మొత్తం రూ. 7,83,500 వరకు ఖాతాల్లో చెల్లింపులు చేయించి చివరికి ఎటూ తిరిగి రాకుండా మోసం చేశారు. పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ తరహా మోసాల నుంచి రక్షణ పొందాలంటే జాగ్రత్తే ఒకే మార్గమని తెలంగాణ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
Myopia: 2050 వరకు భారత్లో సంగం మంది స్కూలుకెళ్లే పిల్లలకు కళ్ల జోడు?
తాజావార్తలు
-
Fish Price Down: యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన ట్యూనా ఫిష్ ధర..
-
AP Govt: ఏపీ ఆర్థిక ప్రగతికి ‘నాబార్డ్’ ఊతం.. రూ.5.11 లక్షల కోట్లతో భారీ రుణ ప్రణాళిక..
-
PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్మైండ్ ఎవరు.?
-
Karuppu : మే 14న ‘వీరభద్రుడు’కి లైన్ క్లియర్
-
Chiranjeevi: ఆర్.బి. చౌదరి ఆకస్మిక దుర్మరణం మనసుని కలిచివేసింది!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!