Crime News: వారం రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. గుర్తించలేని స్థితిలో తల్లి, సోదరుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The body has been in the house for a week: కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోయినా.. తల్లి, సోదరుడు గుర్తించలేకపోయారు. మృతదేహం ఇంట్లోనే కుళ్లిపోయి, పురుగులు పడుతున్నా.. ఎప్పటిలానే వారు సాధారణ జీవితం గడిపారు. దుర్వాసన వస్తుండగా.. పక్కింటి యువకులు లోపలి వెళ్లి చూడగా అసలు విషయం వెలుగుచూసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని చింతల్లో చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం వెంకటపురం గ్రామానికి చెందిన ముక్కు రాధాకుమారి (45) 5 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి చింతల్లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. రాధాకుమారి 20 ఏళ్ల క్రితం విడాకులు తీసుకోగా.. అప్పటి నుంచి ఆమె సోదరుడు పవన్, తల్లి విజయలక్ష్మితో కలిసి చింతల్లోనే ఉంటున్నారు. కొన్నేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న రాధాకుమారికి వైద్యం చేయించినా పరిస్థితి మెరుగుపడలేదు. రెండేళ్లుగా ఇంట్లోనే ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
Also Read
- Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
- Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
రాధాకుమారి సోదరుడు పవన్ ఓ ఫార్మా కంపెనీలో పనిచేసేవాడు. తల్లి మానసిక స్థితి బాగోలేక పోవడం, అక్క అనారోగ్యంతో బాధపడుతుండడంతో.. ఇద్దరినీ ఆయనే చూసుకుంటున్నారు. అయితే పవన్ మానసిక స్థితి కూడా క్షీణించడంతో రెండు నెలల క్రితం కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో తరచూ బయటకు వచ్చే పవన్.. పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు. వారం రోజుల క్రితం సోదరి రాధాకుమారి మరణించినా గుర్తించలేదు. రోజులు గడిచినా సోదరి మృతి చెందినట్లు పవన్ గుర్తించలేక పోయాడు.
Also Read: Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
అప్పుడప్పుడు పవన్ బైక్ తీసుకునే పక్కింట్లో ఉండే యువకులు మంగళవారం రాత్రి ఇంటి తలుపు తట్టారు. పవన్ తలుపులు తీయడంతో.. వారికి తీవ్ర దుర్వాసన వచ్చింది. ఏంటని ఇంటి లోపలికి వెళ్లిచూడగా.. మంచంపై రాధాకుమారి మృతిచెంది ఉంది. మీ అక్క చనిపోయిందని చెప్పినా.. పవన్ స్పందించలేదు. దాంతో యువకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జీడిమెట్ల పోలీసులు ఇంటికి వచ్చి.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
ట్రెండింగ్
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!