Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Crime Nepali Gang Arrested As Domestic Helpers Theft Hyderabad

Jubilee Hills Robbery Case: చోరీ కేసులో సంచలన మలుపు.. నేపాల్ బోర్డర్‌లో నిందితుల అరెస్ట్!

Published Date :February 10, 2026 , 9:57 pm
By Shiva Ganesh
Jubilee Hills Robbery Case: చోరీ కేసులో సంచలన మలుపు.. నేపాల్ బోర్డర్‌లో నిందితుల అరెస్ట్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jubilee Hills Robbery Case: ఇంట్లో పనిమనుషులుగా నటిస్తూ దోపిడీలకు పాల్పడుతున్న నేపాలీ గ్యాంగ్ భరతం పట్టారు పోలీసులు. ఇటీవల నందగిరి హిల్స్‌లో ఓ ఇంట్లో చోరీ చేసిన గ్యాంగ్‌ను నేపాల్‌కు పారిపోతుండగా పట్టుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేసి మరీ ఆ ముఠా ఆటకట్టించారు పోలీసులు. జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌లో ఓ వ్యాపారి నివాసంలో ఫిబ్రవరి 5న చోరీ జరిగింది. ఇంట్లో పని చేస్తున్న నేపాలీ గ్యాంగ్‌ పనేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ కేసును సీరియస్‌గా దర్యాప్తు చేశారు. అంతే కాదు అందులోని ఇద్దరు నిందితుల్ని నేపాల్ సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. నేపాలీలకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని ముంబైలో పట్టుకున్నారు. బంగారం వెండి ఆభరణాలను తీసుకొని పరారీలో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

READ ALSO: Valentine’s Day Scams: పోరగాళ్లు జర జాగ్రత్త.. వాలెంటైన్స్‌ డే ప్లాన్స్‌లో ఈ 5 తప్పులు చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ!

కొన్ని రోజుల ముందుగానే ఇంట్లో దోపిడీ చేయాలని నేపాలీలు ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే నందగిరి హిల్స్‌లో ఉంటున్న వ్యాపారి రవీంద్రకుమార్ శర్మ ఇంట్లో ఉంటున్న నేపాలీలతో పరిచయం పెంచుకున్నారు. తమకు తాము నేపాల్ నుంచి వచ్చామని పరిచయం పెంచుకొని ఆ ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే గత నెల రోజుల నుంచి ఇద్దరు నేపాలీలు ఇంట్లో పని చేస్తున్నారు. యజమానికి చాలా నమ్మకంగా పనిచేస్తున్నారు. ఐతే కొత్తగా వచ్చిన నేపాలీలు.. యజమాని ఇంటి నుంచి ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తారు అనే విషయంపై రెక్కీ నిర్వహించారు.

ఫిబ్రవరి 5న యజమాని రవీంద్రకుమార్‌ శర్మ ఇంట్లో చోరీ చేశారు. చోరీ కేసులో ప్రధాన నిందితుడైన భూపేందర్‌ సాహా అలియాస్‌ భువన్‌ ముఠా పక్కా ప్రణాళికతో లక్షలాది రూపాయల విలువైన బంగారు, వజ్రాభరణాలను చోరీ చేసి పరారీ అయ్యారు. యజమానులు ఫంక్షన్‌ కోసం బయటకు వెళ్లి వస్తారనే ముందస్తు సమాచారంతో భూపేందర్‌ తన స్నేహితులను పిలిపించి జన్మదినం పేరుతో ఇంట్లోని వాచ్‌మెన్‌తో సహా ముగ్గురికి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చినట్లు తేలింది. అయితే సీసీ కెమెరాలకు చిక్కకుండా నందగిరి హిల్స్‌ నుంచి ప్రధాన రోడ్లపై కాకుండా అంతర్గత రోడ్లపై నుంచి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

భూపేందర్‌ను పనిలో కుదిర్చిన మదన్‌ అనే ఏజెంట్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడిది నేపాల్‌లోని దాయ్‌లేక్‌ మున్సిపాల్టీలోని అతిభిషన్‌ అనే ప్రాంతంగా గుర్తించారు. చోరీ చేసిన అనంతరం బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో తలదాచుకునే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు. నేపాల్‌ సరిహద్దు ప్రాంతంలో కాపు కాశారు. కోల్‌కతా, గోరఖ్‌పూర్‌తో పాటు మహారాష్ట్రలోని పుణె ప్రాంతంలో తెలిసినవారి ఇండ్లకు వెళ్లే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపించారు. చోరీ చేసిన తర్వాత నేపాలీలు ఇద్దరు నేరుగా వివిధ మార్గాల ద్వారా ముంబైకి చేరుకున్నారు. అక్కడ ఒక వ్యక్తి వాళ్లకు ఆశ్రయం కల్పించాడు. వాళ్లు పారిపోతున్న సమయంలో సెల్ ఫోన్ జారీ ఇంటి వద్దనే పడిపోయింది. ఒకరోజు పాటు ముంబైలో షెల్టర్ తీసుకున్న తర్వాత ట్రైన్ మార్గంలో బీహార్ సమీపంలోని నేపాల్‌ సరిహద్దుకు చేరుకున్నారు. అయితే అప్పటికే హైదరాబాద్ పోలీసులు అక్కడ మాటు వేశారు. ఇండియా నేపాల్ సరిహద్దు సంబంధించి నాలుగు మార్గాల గుండా వెళ్లి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో నాలుగు ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీసులు మాటు వేసి అక్కడ వాళ్లని అదుపులోకి తీసుకున్నారు. అయితే ముందస్తు ప్లాన్‌లో భాగంగానే వాళ్లు ఆ ఇంట్లోకి వెళ్లి దోపిడీ చేసి వివిధ మార్గాల ద్వారా నేపాల్ కి చేరుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈ ప్లాన్ బెడిసి కొట్టిందని పోలీసులు చెప్తున్నారు.

READ ALSO: Anil Ambani: చిక్కుల్లో అంబానీ ఫ్యామిలీ.. అనిల్ అంబానీ భార్యకు ఈడీ సమన్లు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Domestic helpers theft case
  • Gold jewellery theft case
  • House theft gang busted
  • Hyderabad crime latest news
  • Hyderabad police crime news

తాజావార్తలు

  • Off The Record : తెలంగాణ స్పీకర్ కు ఢిల్లీ పిలుపు

  • Off The Record: ప్రకాశం జనసేనలో బాలినేని ఉక్కిరి బిక్కిరి?

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • Iran War: భారత్‌కు గ్యాస్ సరఫరా తగ్గించిన ఖతార్..

  • MLA Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలికి హైకోర్టులో ఊరట

ట్రెండింగ్‌

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions