Godavari Floods: సీఎం జగన్కు లేఖ.. వరద బాధితులను ఆదుకోండి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godavari Floods: బీడుభూములకి పచ్చని రంగు అద్దాలన్న, పండిన పంటని నాశనం చెయ్యాలన్న ఒక్క వర్షానికే సాధ్యం అనేలా ఉంది పరిస్థితి, అయితే అతి వృష్టి లేకుంటే అనావృష్టి, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వళ్ల పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు..
Read Also: Suicide: ఉరి వేసుకుని యువతి సూసైడ్.. హాస్పటల్ దగ్గర ఉద్రిక్తత
Also Read
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
- WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
రంపచోడవరం నియోజక వర్గం పరిధిలోని ఎటపాక, చింతూరు, కూనవరం, విఆర్ పురం మండలాల్లో పర్యటించిన సీపీఎం బృందం.. వరద బాధితుల కష్టాలను తెలుసుకుంది.. వారి దీనస్థితిని సీఎం వైఎస్ జగన్ దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లారు శ్రీనివాసరావు. గతంలో గోదావరికి సాధారణంగ 4 లేక 5 సంవత్సరాలకి ఒకసారి వరదలు వచ్చేవి.. కానీ, ప్రస్తుతం వరుసగా వరదలు వస్తున్నాయి, దీనికి కారణం బ్యాక్ వాటర్ రావడం, 35 అడుగుల నీరు భద్రాచలం దగ్గర ఉన్నప్పుడే నీళ్లు గ్రామాలని చుట్టుముట్టాయి, 10 నుండి 12 అడుగుల నీళ్లు ఊరు చుట్టూ చేరడంతో ప్రజలు బయటకి రాలేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఏక్షణం లో ఎం జరుగుతుందో అని భయాందోళనలకు గురి అవుతున్నారని, 12 రోజులు అయినా వాళ్ళకి ఎలాంటి సహాయం అందలేదని 12 రోజుల తర్వాత కలెక్టర్ కి విన్నవించుకున్నాక ఒక బోట్ పంపించారని 45 కాంటూరులో ఉండేటువంటి అనేక గ్రామాలు 32వ కాంటూరులోనే మునిగిపోయాయని, ఊర్లోకి నీరు రాకపోయినా చుట్టూ నీరు చేరిన అలాంటి ప్రాంతాలని కూడా మునక ప్రాంతం కిందనే గుర్తించాలని లేఖలో పేర్కొన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు.
తాజావార్తలు
-
DoT New SIM Rules 2026: కొత్త SIM Card తీసుకోవాలనుకుంటున్నారా? DoT కొత్త రూల్స్ ఇవే.. పూర్తి వివరాలు
-
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
-
India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!