V Srinivasa Rao: ఉద్దేశపూర్వకంగా రాజధానిపై వివాదం..! ఉమ్మడి రాజధాని అంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V Srinivasa Rao: ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్త వ్యవహారం తెరపైకి వచ్చింది.. హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేస్తే బాగుంటుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను కొందరు సమర్థించగా.. విపక్షాలు మండిపడుతున్నాయి.. విశాఖలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే ప్రజలు ఉమ్మేస్తారు అని హెచ్చరించారు.. ఉద్దేశ పూర్వకంగా రాష్ట్రంలో రాజధాని వివాదం రేకేస్తున్నారని మండిపడ్డారు.. మరోవైపు.. బీజేపీకి మద్దతు తెలుపుతున్న పార్టీలను రాన్నున్న ఎలక్షన్ లో ఓడించాలని పిలుపునిచ్చారు శ్రీనివాసరావు.. వైసీపీ, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని ఆరోపించిన ఆయన.. టీడీపీ – జనసేన పార్టీలు బీజేపీకి పల్లకి మోస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఏ పార్టీకి ఓటు వేసినా.. బీజేపీకి ఓటు వేసినట్టే అవుతుందని దుయ్యబట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీ వచ్చిన వాళ్లతో కలిసి పోరాడుతామని ప్రకటించారు సీపీఎం ఏపీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు.
Read Also: Public Examination Bill: పేపర్ లీకుల నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర..
Also Read
- Passport Fee: పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
కాగా, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి.. ఉమ్మడి రాజధాని హోదాను హైదరాబాద్కు మరికొన్ని సంవత్సరాలు పొడిగించేలా తమ పార్టీ ఒత్తిడి తెస్తుందంటూ చేసినర వ్యాఖ్యలు వివాదంగా మారాయి.. ఈ ఏడాది జూన్లో ముగియనున్న AP పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం.. హైదరాబాద్ను 10 సంవత్సరాల పాటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లకు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్పై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని ఏపీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ను సమర్థించారు. ఇక, సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభలో వైసీపీ ఈ డిమాండ్ను లేవనెత్తుతుందని అన్నారు. ఏపీ రాజధాని నిర్మాణంలో జాప్యానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడే కారణమని, తాత్కాలిక రాజధాని ఏర్పాటు పేరుతో టీడీపీ ప్రభుత్వం కాలయాపన చేసిందన్నారు. భారీ అమరావతి రాజధానిని నిర్మించేందుకు నిరాకరిస్తున్నట్లు జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారని, ఆ నిధులను పేదల సంక్షేమానికి వినియోగించాలని నిర్ణయించుకున్నారని, అయితే రాజధానిని మార్చాలని ఆయన నిర్ణయించుకున్నారని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించిన విషయం విదితమే
తాజావార్తలు
-
Passport Fee: పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!