CPI Ramakrishna: పాక్తోనే చర్చలు జరిపి యుద్ధం ఆపేశారు.. మావోయిస్టులు భారత పౌరులే అయినా చర్చలు చేయరా?
- నంబాల మృతదేహంను అప్పగించకపోవడంపై నిరసన
- నిరసనలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
- మావోయిష్టులు భారత పౌరులు అయినా చర్చలు చేయమంటారా?
- కేంద్ర ప్రభుత్వం కోర్టులను తప్పుదోవ పట్టించింది
మావోయిస్టుల మృతదేహాలు అప్పగించడంలో కేంద్ర ప్రభుత్వం కోర్టులను తప్పుదోవ పట్టించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించకపోవడంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులు చర్చలకు వస్తామన్నా కేంద్రం తిరస్కరించి వెంటాడి చంపుతామనే పద్ధతి అనుసరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శత్రుదేశం పాకిస్థాన్తోనే చర్చలు జరిపి యుద్ధం ఆపేశారని, మావోయిస్టులు భారత పౌరులు అయినా చర్చలు చేయమంటారా? అని రామకృష్ణ ప్రశ్నించారు.
మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ మృతదేహంను కుటుంబ సబ్యులకు అప్పగించకపోవడంపై ప్రజా సంఘాల ఐక్యవేదిక నిరసన తెలిపింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సహా సీపీఎం, పౌర హక్కుల సంఘం, ప్రజాసంఘాల నేతలు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ… ‘మావోయిస్టుల మృతదేహాలు అప్పగించడంలో కేంద్ర ప్రభుత్వం కోర్టులను తప్పుదోవ పట్టించింది. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని తెలుగు వారి మృతదేహాలు ఇప్పించాలని నిన్న లేఖ రాసాము. మృతదేహాలు అప్పగించకపోవడంపై సమగ్ర విచారణ జరిపించాలి. మావోయిస్టులు చర్చలకు వస్తామన్నా.. కేంద్రం తిరస్కరించి వెంటాడి చంపుతామనే పద్ధతి అనుసరించింది. ఇది నక్సలైట్లకు, కమ్యూనిస్టులకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు. శత్రుదేశం పాకిస్థాన్తోనే చర్చలు జరిపి యుద్ధం ఆపేశారు. మావోయిష్టులు భారత పౌరులు అయినా చర్చలు చేయమంటారా?’ అని ప్రశ్నించారు.
Also Read
Also Read: TDP Mahanadu 2025: మరలా పెద్ద నోట్లు రద్దు చేయాలి.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు మృతదేహానికి ఛత్తీస్గఢ్ పోలీసులు దహన సంస్కారాలు నిర్వహించారు. శవాన్ని అప్పగించాలని నంబాల బంధువులు కోరినా.. పోలీసులు ససేమిరా అన్నారు. దాంతో నంబాల బంధువులు నిరాశతో ఇంటికి పయనం అయ్యారు. మృతదేహాన్ని అప్పగించలని వేడుకున్నా ఫలితం లేకపోయిందంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జీయన్నపేటలో విషాదచయలు అలుముకున్నాయి. చేసేసి లేక నంబాల కేశవరావు చిత్రపటానికి కుటుంబసభ్యులు నివాళి అర్పించారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!