Ramakrishna: రాష్ట్రాన్ని రక్షించండి.. దేశాన్ని కాపాడండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramakrishna: రాష్ట్రాన్ని రక్షించండి.. దేశాన్ని కాపాడండి అంటూ సీపీఐ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర రాజమండ్రికి చేరుకుంది. తాడితోట జంక్షన్ నుండి కోటిపల్లి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రసంగిస్తూ రాష్ట్రాన్ని రక్షించండి.. దేశాన్ని కాపాడండి అంటూ సీపీఐ ఆద్వర్యంలో బస్సు యాత్ర ఈ నెల 17 న ప్రారంభించి ఇప్పటివరకు 6 జిల్లాల్లో పర్యటన పూర్తి చేసుకుని రాజమండ్రికి చేరుకున్నామని అన్నారు. పోరాడే వాడికి ఎప్పుడూ ఎర్ర జెండా చేతిలో ఉంటుందని పేర్కొన్నారు. కడియం పోలీసు స్టేషన్ లో దళిత యువకుడిని చిత్ర హింసలు పెట్టి.. మూత్రం తాగమని దాష్టీకం చేసిన ఎస్ ఐ కు అసలు బుద్దుందా? అని మండిపడ్డారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ హయాంలోనే దళిత డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబును పక్కన పెట్టుకున్న ఘనత జగన్ దేనని ఆరోపించారు.
Read Also: Uttarakhand: మితిమీరిన వేగం.. గాల్లో ప్రాణాలు.. బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి
Also Read
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- India vs Sri Lanka: ఒకప్పుడు భారత్కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు రామకృష్ణ. నీకో న్యాయం.. దళితులకో న్యాయమా.. అంటూ ప్రశ్నించారు. పోలీసు స్టేషన్లో శిరోముండనం చేస్తే చర్యలు తీసుకోలేదని, సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత జిల్లాలోనే పర్యటిస్తే.. వాళ్లపై అక్రమంగా దాడులు చేయించడమే కాకుండా తిరిగి కేసులు నమోదు చేయించడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడైనా అభివృద్ధి చేసావా జగన్ ? అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం పోలవరాన్ని నట్టేట ముంచి.. నిర్వాసితులను గుట్టలు ఎక్కి తలదాచుకోవాల్సిన దుస్థితికి తీసుకువచ్చారని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కమ్యూనిస్ట్ పార్టీలు నడుం బిగించాయని.. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడే వరకు పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ.
తాజావార్తలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
-
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
-
Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని
-
IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
-
Slum Dog 33 Temple Road: టబు పోలీస్ గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!