CPI Ramakrishna: ఏపీలో భూముల అన్యాక్రాంతంపై సీఎంతో మాట్లాడుతా..
- చంద్రబాబు శ్వేతపత్రాలు.. జగన్ ప్రకటనలతో ప్రజలు అయోమయంలో ఉన్నారు- సీపీఐ రామకృష్ణ
- ఏ రంగంలో దేశ అభివృద్ధి జరిగిందో సీనియర్ నాయకుడు చంద్రబాబు చెప్పాలి- రామకృష్ణ
- సీనియర్ ఐఏఎస్ అధికారితో రాష్ట్ర వ్యాప్తంగా భూముల అన్యాక్రాంతం పై సమగ్ర విచారణ జరపాలి
- జూలై 31న సీఎం చంద్రబాబును భూముల అన్యాక్రాంతంపై కలవాలని నిర్ణయించాం- రామకృష్ణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు శ్వేతపత్రాలు, జగన్ ప్రకటనలతో ప్రజలు అయోమయంలో ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఏ రంగంలో దేశ అభివృద్ధి జరిగిందో సీనియర్ నాయకుడు చంద్రబాబు చెప్పాలని అన్నారు. 1.2 లక్షల రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే అభివృద్ధి అని ఎలా చెపుతారని ప్రశ్నించారు. 40% గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు.. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం రికార్డులు దగ్ధం కారణంగా హైలైట్ అయిందన్నారు. బద్వేలు నియోజకవర్గంలోనే 30 వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని ఆరోపణ ఉందని రామకృష్ణ తెలిపారు. మదనపల్లె మాత్రమే కాదు.. మిగతా అన్ని చోట్లా ప్రభుత్వం పరిశీలించాలని ఆయన కోరారు.
Read Also: Nithya Pellikoduku: మహిళల్ని మోసం చేస్తూ 20కి పైగా పెళ్లిళ్లు.. నిత్యపెళ్లికొడుకు అరెస్ట్..
Also Read
- Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
- ICC Women's Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
- UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
సీనియర్ ఐఏఎస్ అధికారితో రాష్ట్ర వ్యాప్తంగా భూముల అన్యాక్రాంతం పై సమగ్ర విచారణ జరపాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. జూలై 31న సీఎం చంద్రబాబును భూముల అన్యాక్రాంతంపై కలవాలని నిర్ణయించామని తెలిపారు. పదేళ్ళ పాలనలో అవినీతి తగ్గిందా.. పారిపోయిన వాళ్ళను తెచ్చి శిక్షించారా అని ప్రశ్నించారు. మోడీ అధికారంలోకి వచ్చాక ఇండియా పేదరికంలో నంబర్ 1 అయిందని ఆరోపించారు. రాష్ట్రంలో అప్పు పై చంద్రబాబు, యనమల, జగన్, బుగ్గన రకరకాలుగా చెపుతున్నారన్నారు. ప్రపంచ బ్యాంకు ద్వారా లోన్ కి నిర్మలా సీతారామన్, మోడీ అక్కర్లేదు.. చంద్రబాబు తానే ప్రపంచ బ్యాంకు నుంచీ తెచ్చుకోగలడని తెలిపారు. ఆర్థిక పరిణామాల పైన క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని రామకృష్ణ పేర్కొన్నారు.
Read Also: Paris Olympics 2024: భారత్ ఖాతాలో తొలి పతకం..చరిత్ర సృష్టించిన మను భాకర్
తాజావార్తలు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
-
Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!