CPI Narayana: తుఫాను నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించేందుకు కేంద్రం మీద ఒత్తిడి తేవాలి..
CPI Narayana: తిరుపతి జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, వరద బాధితులను పరామర్శించారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ. తీర ప్రాంతమైన సూళ్లూరుపేట నియోజకవర్గంలో తుఫాన్ దెబ్బకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూస్తే మనసు కలిచి వేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించేందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలన్నారు. వరి పంట వేసిన రైతులు దారుణంగా నష్టపోయారని.. ఎకరానికి రూ.30 వేల రూపాయలు , తుఫాన్ ప్రభావిత ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు, దెబ్బతిన్న ఇళ్ళకు రూ.30 వేల రూపాయల సాయాన్ని తక్షణమే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: AP CM YS Jagan: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ ఫోన్లో పరామర్శ
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
వట్రపాలెం గ్రామం మునిగిపోవడానికి చుట్టూ ఉన్న అక్రమ లే అవుట్లే కారణమన్నారు. వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రాన్ని చూసి రాష్ట్రం గడగడ వణికి పోతోందని.. కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లి మూతులు నాకే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని నారాయణ విమర్శించారు. ఇకనైనా లాలూచీ ఆపితే అభివృద్ధికి మద్దతు ఇస్తామన్నారు. దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జగన్ మాత్రమే 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారన్నారు. మోడీ, అమిత్ షాల దయా దాక్షిణ్యాలతో జగన్ బతుకుతున్నాడని ఎద్దేవా చేశారు.
Read Also: Seediri Appalaraju: విశాఖలో పవన్ మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి ..
తెలంగాణలో రాజకీయ మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారని.. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ అప్రజాస్వామ్య పాలన చేస్తూ ప్రజా వ్యతిరేక ఉద్యమాలను అడ్డుకున్నారని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేలను కూడా సచివాలయానికి పోనీయలేదని పేర్కొన్నారు. అవినీతి పాలన కేసీఆర్ సొంతమని.. కాళేశ్వరం ప్రాజెక్టులో తవ్వితే వేల కోట్ల రూపాయల అవినీతి బయటపడుతోందన్నారు. ఎక్కడ చూసినా అవినీతి మయమని.. కల్వకుంట్ల కుటుంబానికి అహంభావం పెరిగిందన్నారు. కూతురు కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారని.. బీజేపీతో కేసీఆర్ రాజీపడ్డారని ఆయన అన్నారు. ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్లు కలిసాయని ప్రజలు భావించారని.. అందుకే బీఆర్ఎస్ ఓడిందన్నారు. కేసీఆర్ సీఎం అవగానే గడీల వ్యవస్థను తీసుకొచ్చాడని.. గడీలలో పెట్టుకొని సచివాలయం, పగతిభవన్లోకి, ప్రజలను ఎమ్మెల్యేలను కూడా పోనీయకుండా చేశారని ఆయన మండిపడ్డారు. దాంతో ప్రజలకు కేసీఆర్ దూరమయ్యారని.. ఆ గేట్లను పగలగొట్టి ప్రజలకు రేవంత్ రెడ్డి దగ్గరయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!