CPI Narayana: తుఫాను నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించేందుకు కేంద్రం మీద ఒత్తిడి తేవాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana: తిరుపతి జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, వరద బాధితులను పరామర్శించారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ. తీర ప్రాంతమైన సూళ్లూరుపేట నియోజకవర్గంలో తుఫాన్ దెబ్బకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూస్తే మనసు కలిచి వేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించేందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలన్నారు. వరి పంట వేసిన రైతులు దారుణంగా నష్టపోయారని.. ఎకరానికి రూ.30 వేల రూపాయలు , తుఫాన్ ప్రభావిత ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు, దెబ్బతిన్న ఇళ్ళకు రూ.30 వేల రూపాయల సాయాన్ని తక్షణమే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: AP CM YS Jagan: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ ఫోన్లో పరామర్శ
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
వట్రపాలెం గ్రామం మునిగిపోవడానికి చుట్టూ ఉన్న అక్రమ లే అవుట్లే కారణమన్నారు. వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రాన్ని చూసి రాష్ట్రం గడగడ వణికి పోతోందని.. కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లి మూతులు నాకే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని నారాయణ విమర్శించారు. ఇకనైనా లాలూచీ ఆపితే అభివృద్ధికి మద్దతు ఇస్తామన్నారు. దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జగన్ మాత్రమే 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారన్నారు. మోడీ, అమిత్ షాల దయా దాక్షిణ్యాలతో జగన్ బతుకుతున్నాడని ఎద్దేవా చేశారు.
Read Also: Seediri Appalaraju: విశాఖలో పవన్ మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి ..
తెలంగాణలో రాజకీయ మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారని.. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ అప్రజాస్వామ్య పాలన చేస్తూ ప్రజా వ్యతిరేక ఉద్యమాలను అడ్డుకున్నారని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేలను కూడా సచివాలయానికి పోనీయలేదని పేర్కొన్నారు. అవినీతి పాలన కేసీఆర్ సొంతమని.. కాళేశ్వరం ప్రాజెక్టులో తవ్వితే వేల కోట్ల రూపాయల అవినీతి బయటపడుతోందన్నారు. ఎక్కడ చూసినా అవినీతి మయమని.. కల్వకుంట్ల కుటుంబానికి అహంభావం పెరిగిందన్నారు. కూతురు కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారని.. బీజేపీతో కేసీఆర్ రాజీపడ్డారని ఆయన అన్నారు. ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్లు కలిసాయని ప్రజలు భావించారని.. అందుకే బీఆర్ఎస్ ఓడిందన్నారు. కేసీఆర్ సీఎం అవగానే గడీల వ్యవస్థను తీసుకొచ్చాడని.. గడీలలో పెట్టుకొని సచివాలయం, పగతిభవన్లోకి, ప్రజలను ఎమ్మెల్యేలను కూడా పోనీయకుండా చేశారని ఆయన మండిపడ్డారు. దాంతో ప్రజలకు కేసీఆర్ దూరమయ్యారని.. ఆ గేట్లను పగలగొట్టి ప్రజలకు రేవంత్ రెడ్డి దగ్గరయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!