Ramakrishna: కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిక..! ఇల్లు అలకగానే పండుగ కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramakrishna: వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.. ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్న ఆమె.. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారట.. అదే రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారని తెలుస్తోంది.. ఆమెతో పాటు సుమారు 40 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది.. అయితే, వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. షర్మిల రాకతో కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమికి కూడా ప్రయోజనమేనన్న ఆయన.. వైసీపీ నుంచి బయటకు రావాలనుకునే వారికి షర్మిల ద్వారా అవకాశం దొరికినట్టే అన్నారు.. అయితే, ఇల్లు అలకగానే పండుగ కాదు.. షర్మిల రాకతోనే వెంటనే అన్నీ జరగబోవు అని వ్యాఖ్యానించారు.
Read Also: Municipal Staff Strike: మున్సిపల్ కార్మికుల సమ్మె.. చర్చలు సఫలం అయ్యేనా..?
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
ఇక, ఫిబ్రవరి నెలాఖరులో మా ఎత్తులు, పొత్తులు తేలుతాయన్నారు రామకృష్ణ.. బీజేపీ వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్, వామపక్షాలు అని స్పష్టం చేశారు. ప్రధాని మోడీవి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అని మండిపడ్డారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలే లిక్కర్ స్కాం ఏపీలో జరుగుతోందని లెటర్ ఇచ్చినా ప్రొసీడ్ కాలేదు అని ఆరోపించారు. రాష్ట్రంలో కిందిస్ధాయి ఉద్యోగులు జీతాల కోసం రోడ్లెక్కే పరిస్ధితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1.06 లక్షల అంగన్వాడీ వర్కర్ల నిరసన ధర్నాను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. అయితే, రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే అంగన్వాడీల కలెక్టరేట్ల దిగ్బంధన కార్యక్రమానికి సీపీఐ మద్దతిచ్చి పాల్గొంటుందని ప్రకటించారు. మరోవైపు.. 11 లక్షల కోట్ల అప్పులు చేశారు.. మరో 2 వేల కోట్ల అప్పు చేస్తే ఏమైనా పోతుందా? అని ప్రశ్నించారు రామకృష్ణ.. బైజూస్ కంపెనీ రూ.9200 కోట్ల మనీలాండరింగ్ లో ఉన్న కంపెనీ.. బజాజ్ ఫైనాన్స్ తో టైఅప్ చేసుకుని బైజూస్ విద్యార్ధులను దోచుకుంటోందని ఆరోపించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!