Ramakrishna: కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిక..! ఇల్లు అలకగానే పండుగ కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramakrishna: వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.. ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్న ఆమె.. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారట.. అదే రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారని తెలుస్తోంది.. ఆమెతో పాటు సుమారు 40 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది.. అయితే, వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. షర్మిల రాకతో కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమికి కూడా ప్రయోజనమేనన్న ఆయన.. వైసీపీ నుంచి బయటకు రావాలనుకునే వారికి షర్మిల ద్వారా అవకాశం దొరికినట్టే అన్నారు.. అయితే, ఇల్లు అలకగానే పండుగ కాదు.. షర్మిల రాకతోనే వెంటనే అన్నీ జరగబోవు అని వ్యాఖ్యానించారు.
Read Also: Municipal Staff Strike: మున్సిపల్ కార్మికుల సమ్మె.. చర్చలు సఫలం అయ్యేనా..?
Also Read
- Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
- Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
- Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
ఇక, ఫిబ్రవరి నెలాఖరులో మా ఎత్తులు, పొత్తులు తేలుతాయన్నారు రామకృష్ణ.. బీజేపీ వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్, వామపక్షాలు అని స్పష్టం చేశారు. ప్రధాని మోడీవి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అని మండిపడ్డారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలే లిక్కర్ స్కాం ఏపీలో జరుగుతోందని లెటర్ ఇచ్చినా ప్రొసీడ్ కాలేదు అని ఆరోపించారు. రాష్ట్రంలో కిందిస్ధాయి ఉద్యోగులు జీతాల కోసం రోడ్లెక్కే పరిస్ధితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1.06 లక్షల అంగన్వాడీ వర్కర్ల నిరసన ధర్నాను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. అయితే, రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే అంగన్వాడీల కలెక్టరేట్ల దిగ్బంధన కార్యక్రమానికి సీపీఐ మద్దతిచ్చి పాల్గొంటుందని ప్రకటించారు. మరోవైపు.. 11 లక్షల కోట్ల అప్పులు చేశారు.. మరో 2 వేల కోట్ల అప్పు చేస్తే ఏమైనా పోతుందా? అని ప్రశ్నించారు రామకృష్ణ.. బైజూస్ కంపెనీ రూ.9200 కోట్ల మనీలాండరింగ్ లో ఉన్న కంపెనీ.. బజాజ్ ఫైనాన్స్ తో టైఅప్ చేసుకుని బైజూస్ విద్యార్ధులను దోచుకుంటోందని ఆరోపించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.
తాజావార్తలు
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్పై ఎన్టీఆర్ ఫోకస్
-
Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
-
Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
-
Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!