CP AV Ranganath : సాహితీ బాధితులకు న్యాయం చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రీ లాంచింగ్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ సాహితీ ఇన్ఫ్రా చేసిన వసూళ్ల దందాపై పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫ్లాట్లు నిర్మాణం చేసి ఇస్తామని డబ్బు కట్టించుకుని మోసం చేశారని 2022 ఆగష్టులో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ భూదాటి లక్ష్మీ నారాయణపై యశ్వంత్ కుమార్తో పాటు మరో 240 మంది హైదరాబాద్ సీసీఎస్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎండీ లక్ష్మీ నారాయణను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ సీపీ సీసీఎస్ ఏవీ రంగనాథ్ సోమవారం మాట్లాడుతూ.. సాహితీ బాధితులకు న్యాయం చేస్తామని, సాహితీ కేసులో పారదర్శకంగా దర్యాప్తు చేపడుతామన్నారు.
Also Read
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- SL A vs Ind A: 100వ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
1800కోట్ల మోసం జరిగిందని, స్పెషల్ టీమ్స్ ద్వారా కేసు దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులను అటాచ్ చేస్తామని, మోసపోయిన బాధితులు ఎవరు ఉన్న సీసీఎస్ లో ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేసులను సీసీఎస్ కు బదిలీ చేసేలా చూస్తామని, సాహితీ అన్ని ప్రాజెక్ట్ ల బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని, రెండు నెలల్లో కేసును ఓ కొలిక్కి తీసుకువస్తామన్నారు. సాహితీ లక్ష్మి నారాయణ ద్వార లబ్ది పొందిన వారందరిని విచారిస్తామని, అగ్రిగోల్డ్ ఆస్తుల లాగే హై కోర్టు ఆదేశాలతో సాహితీ బాధితులకు న్యాయం చేస్తామన్నారు సీపీ రంగనాథ్.
ఇదిలా ఉండగా.. సాహితీ ఉద్యోగులు ఇచ్చిన రికార్డుల ప్రకారం సాహితీ కృతి బ్లూసమ్, సాహితీ సుధీక్ష పేరిట 38 కోట్లు వసూలు చేసిన విషయం పేర్కొనలేదని పోలీసులు వెల్లడించారు. కాగా సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్తో పాటు మెదక్ జిల్లా పరిధిలో సాహితి ఇన్ఫ్రా వెంచర్స్ ఇండియా ప్రై లిమిటెడ్పై పలు ఠాణాల్లో నమోదైన 41 కేసులను 2023 సెప్టెంబర్లో హైదరాబాద్ సీసీఎస్కు బదిలీ చేశారు. దీంతో ఇప్పటివరకు సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, డైరెక్టర్లపై మొత్తంగా 50 కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!