Delhi Water Crisis : ఢిల్లీ నీటి సంక్షోభంపై మంత్రి అతిషి నేడు నిరాహారదీక్ష
- ఢిల్లీ మంత్రి అతిషి నిరాహారదీక్ష
- హర్యానా నుంచి నీళ్లివ్వాలంటూ డిమాండ్
- పాలనలో లోపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమన్న బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Water Crisis : హర్యానా నుంచి అదనపు నీరు ఇవ్వాలని కోరుతూ జలమండలి మంత్రి అతిషి శుక్రవారం నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. నిరాహారదీక్షకు మద్దతుగా ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ముందుకు రావాలని ఆప్ విజ్ఞప్తి చేసింది. ఈ చర్య ఢిల్లీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యమని బిజెపి అభివర్ణించింది. అతిషి నిరాహారదీక్ష కేవలం ప్రదర్శన మాత్రమేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం తన వైఫల్యాలను దాచిపెడుతోందని బీజేపీ అంటుంది. జంగ్పురాలోని భోగల్ ప్రాంతంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి అతిషి ఉపవాస దీక్ష ప్రారంభమవుతుంది. దీనికి ముందు ఆమె జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించేందుకు రాజ్ఘాట్కు వెళ్లనున్నారు. ఢిల్లీ వాసులకు అదనపు నీటిని అందించేందుకు అన్ని విధాలా కృషి చేశామని, కానీ హర్యానా మాత్రం నీళ్లు ఇవ్వలేదని అతిషి అన్నారు. ఈ కారణంగానే ఇప్పుడు నీటి సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఢిల్లీ ప్రజలు బీజేపీకి ఏడు సీట్లు ఇచ్చారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఆ తర్వాత కూడా వారికి సరైన నీరు ఇవ్వడం లేదు. నీటి ఎద్దడి బీజేపీ ప్రాయోజితం. బీజేపీ ఢిల్లీ తాగునీటిని ఆపుతోంది. ఏళ్ల తరబడి అందుతున్న 100 ఎంజీడీల నీటిని ఢిల్లీకి ఎందుకు రాకుండా ఆపుతున్నారనేది ప్రశ్న. ఈ నీటితో ఢిల్లీలోని 28 లక్షల మంది ప్రజల నీటి సమస్యను పరిష్కరించవచ్చు, కానీ హర్యానా ప్రభుత్వం ఈ నీటిని అందించడం లేదని ఆయన అన్నారు.
Also Read
- Bihar: దారుణం.. పెళ్లి చేసుకోమన్నందుకు ప్రేయసిని బైక్పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
- PoK Protest: పీఓకేలో పాక్ సైన్యం అరాచకం.. కాల్పుల్లో 20 మంది ఉద్యమకారులు మృతి..
- CM Revanth Reddy: రైతుల కోసం ఉపాధి హామీలో 10 కొత్త పనులు.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ధర్నాకు పోలీసుల ప్లాన్.. దేనికోసమంటే..!
జల్ బోర్డ్ లాభదాయక యూనిట్ కాదు, సేవా యూనిట్: ప్రియాంక
ఢిల్లీ ప్రజలకు మంచి మౌలిక సదుపాయాలు కల్పించడానికి జల్ బోర్డు ఖర్చు చేసిన డబ్బును బీజేపీ నష్టమంటుందని ఆప్ ప్రధాన అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ పేర్కొన్నారు. జల్ బోర్డ్ లాభదాయక యూనిట్ కాదు, సేవా యూనిట్. ఎనిమిదేళ్లలో ఢిల్లీ ప్రభుత్వం 7300 కి.మీ కొత్త పైపులైన్లు వేయడం, 3700 కి.మీ పాత పైప్లైన్లను మార్చడం, కొత్త డబ్ల్యుటిపిలను నిర్మించడం వంటి అనేక పనులను చేసిందని ఆమె తెలిపారు.
ఆప్ తన సొంత వలలో చిక్కుకుంది: బీజేపీ
రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ గురువారం మాట్లాడుతూ.. ఆప్ తన సొంత వలలో చిక్కుకుపోయిందని అన్నారు. నీటి కొరతపై నాయకులు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు ట్యాంకర్ మాఫియా ద్వారా నీటిని అమ్ముకుంటున్నారని, అందుకే హర్యానా నుండి నిర్ణీత పరిమాణం కంటే ఎక్కువ నీరు వస్తున్నప్పటికీ, నీరు అందించడం లేదని ప్రజలు గ్రహించారు. ఎంపి సంజయ్ సింగ్ అతిషి నిరాహార దీక్షలో ఇండియా అలయన్స్ మద్దతు కోరడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఢిల్లీలో నీటి కొరత ఏర్పడినప్పుడు, కేజ్రీవాల్ ప్రభుత్వంలోని వాటర్ బోర్డు అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ స్వయంగా ఆరోపించిందన్నారు.
అతిషిని టార్గెట్ చేసిన ఎంపీలు
నీటి ఎద్దడిపై గురువారం బీజేపీ ఎంపీలు జలమండలి మంత్రి అతిషిపై దాడికి దిగారు. ఢిల్లీ ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని అన్నారు. హర్యానా ఢిల్లీకి పూర్తి స్థాయిలో నీటిని అందించడం లేదని, హిమాచల్ ప్రదేశ్ నుంచి అదనంగా పొందే నీటిని కూడా అడ్డుకుంటున్నదని జలవనరుల శాఖ మంత్రి అతిషి చేసిన ప్రకటన అబద్ధమన్నారు. హర్యానా సీఎం వాస్తవ లెక్కలు చెప్పారు. ఢిల్లీలో నీటి ఎద్దడి ఉందన్నప్పుడు డబ్బులు చెల్లించిన వెంటనే ప్రతి మూలకు నీటి ట్యాంకర్లు, 20 లీటర్ల క్యాన్లు విచ్చలవిడిగా ఎలా లభిస్తాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఢిల్లీలో నీటి ఎద్దడి తీవ్రమైన విషయమని కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా అన్నారు.
తాజావార్తలు
-
Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
-
Heavy Rain Alert: కాసేపట్లో హైదరాబాద్లో కుండపోత.. అత్యవసరమైతేనే బయటకు రండి.!
-
Bihar: దారుణం.. పెళ్లి చేసుకోమన్నందుకు ప్రేయసిని బైక్పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
-
PoK Protest: పీఓకేలో పాక్ సైన్యం అరాచకం.. కాల్పుల్లో 20 మంది ఉద్యమకారులు మృతి..
-
CM Revanth Reddy : ఏపీలో రూ.10 వేల కోట్ల బకాయిలు.. అక్కడ ఎందుకు ప్రశ్నించరు.?
ట్రెండింగ్
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!