Kejriwal: ఇన్సులిన్పై మెడికల్ బోర్డుకు కోర్టు కీలక ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఈడీ-ఆప్ ప్రభుత్వం మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. తీహార్ జైలు వేదికగా కేజ్రీవాల్ను చంపేందుకు ఈడీ కుట్ర చేస్తోందని ఆప్ సర్కార్ ఆరోపిస్తోంది. ఇక మెడికల్ బెయిల్ పొందేందుకు కేజ్రీవాలే తీపి పదార్ధాలు తింటున్నారని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇలా కొద్ది రోజులుగా కేజ్రీవాల్ ఆరోగ్యంపై రచ్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం స్పందించింది. కేజ్రీవాల్కు క్రమం తప్పకుండా ఇన్సులిన్ అవసరమా?, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? పరీక్షించేందుకు వైద్యుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఢిల్లీ ఎయిమ్స్ను ధర్మాసనం ఆదేశించింది.
ఇది కూడా చదవండి: కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పోతున్నారా? ఇవి ఫాలో అవ్వండి..
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. ఆయన టైప్-2 డయాబెటీస్తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత వైద్యుడితో రోజూ వర్చువల్గా సంప్రదించే అవకాశాన్ని కల్పించాలని ఆయన చేసిన అభ్యర్థనను రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. ఆయనకు క్రమం తప్పకుండా ఇన్సులిన్ అవసరమా?, ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా? అని పరీక్షించేందుకు వైద్యుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా తాజాగా ఢిల్లీ ఎయిమ్స్ను న్యాయస్థానం ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Earthquake: తైవాన్లో మరోసారి భూకంపం.. ప్రజలు పరుగులు
అంతకుముందు తీహార్ జైలు సూపరింటెండెంట్కు కేజ్రీవాల్ లేఖ రాశారు. మధుమేహం దృష్ట్యా రోజూ ఇన్సులిన్ అడుగుతున్నట్లు స్పష్టంచేశారు. పైగా తన డయాబెటీస్ పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ వైద్యులు ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఎయిమ్స్ డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు ఇన్సులిన్ విషయాన్ని కేజ్రీవాల్ లేవనెత్తలేదని.. వైద్యులు కూడా సూచించలేదని జైలు అధికారులు ప్రకటించారు. జైలు అధికారులు చెప్పిందంతా అబద్ధమని, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో తప్పుడు ప్రకటన విడుదల చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేజులో మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అనంతరం ఈడీకి రెండు సార్లు కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం ఏప్రిల్ 1న కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం కేజ్రీవాల్ బెయిల్కు దరఖాస్తు చేసినా కోర్టులు తిరస్కరించాయి. ప్రస్తుతం ఇన్సులిన్పై తీవ్ర రచ్చ సాగుతోంది. మరోవైపు దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. కేజ్రీవాల్ను ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్గా ఆప్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ వస్తుందా? లేదంటే మరిన్ని రోజులు జైల్లోనే ఉండాలా? అన్నది సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది.
ఇది కూడా చదవండి: Anee Master : అయ్యో పాపం.. జారి పడ్డ మాస్టర్.. వీడియో వైరల్..
తాజావార్తలు
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
-
Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
-
Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
-
Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!