Congress: పీవీ నరసింహారావుకి భారతరత్న ప్రకటనపై కాంగ్రెస్ రియాక్షన్ ఇది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇద్దరు మాజీ ప్రధానులు పీవీ.నరసింహారావు (PV Narasimha Rao), చరణ్ సింగ్ (Charan Singh), ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్ర నిర్ణయాన్ని దేశ వ్యాప్తంగా ఆయా పార్టీలు స్వాగతించాయి. ఇక పీవీ.నరసింహారావుకి భారతరత్న ప్రకటించడంపై కాంగ్రెస్ అగ్ర నేతలు కూడా స్పందించారు.
సోనియాగాంధీ..
పీవీ.నరసింహారావుకి భారతరత్న ఇవ్వడంపై సోనియాగాంధీ (Sonia Gandhi) స్పందించారు. పార్లమెంట్ నుంచి బయటకు వచ్చినప్పుడు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆమె తెలిపారు. పీవీ నరసింహారావు, చరణ్సింగ్, ఎంఎస్ స్వామినాథన్కి భారతరత్న ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు.
Also Read
- Turmeric Stains Remove Tips: బట్టలపై పసుపు మరకలతో ఇబ్బందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేసుకోండి
- CM Revanth: విద్యార్థులపై దాడులు అమానుషం.. నీట్ వ్యవహారంపై కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్..!
- Rahul Gandhi: రక్తం ఓడుతున్న ముఖం, ఊడిపోయిన షూ.. ప్రధాని ఇంటి ముట్టడితో మారిన రాహుల్ గాంధీ పొలిటికల్ మార్క్!
- Delhi protests: హస్తినలో ఆగని ఆందోళనలు.. 16 మెట్రో స్టేషన్లు మూసివేత.. ఆంక్షలు..
జైరాం రమేష్..
పీవీ నరసింహారావు, చరణ్సింగ్, ఎంఎస్ స్వామినాథన్లు ఎప్పటికీ వారు భారతదేశపు రత్నాలేనని కాంగ్రెస్ (Congress) పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) కొనియాడారు. దేశానికి వారు అందించిన సేవలు అపూర్వమని.. ప్రతీ భారతీయుడు వారిని గౌరవిస్తాడని తెలిపారు. డా.స్వామినాథన్ ఫార్ములా (MSP formula) ఆధారంగా రైతులకు కనీస మద్దతు ధర కల్పించే విషయంలో ప్రధాని మోడీ ప్రభుత్వం మౌనం వహిస్తోందని జైరాం రమేశ్ విమర్శించారు. ప్రధాని మోడీ మొండివైఖరి వల్ల ఉద్యమ సమయంలో 700 మంది రైతులు అమరులయ్యారని, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని జైరాం రమేష్ ధ్వజమెత్తారు.
మల్లిఖార్జున ఖర్గే..
పీవీ నరసింహారావు, చరణ్సింగ్, ఎంఎస్ స్వామినాథన్లకు కేంద్రం భారతరత్న ప్రకటించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్వాగతించారు.
తాజావార్తలు
-
Turmeric Stains Remove Tips: బట్టలపై పసుపు మరకలతో ఇబ్బందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేసుకోండి
-
CM Revanth: విద్యార్థులపై దాడులు అమానుషం.. నీట్ వ్యవహారంపై కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్..!
-
RRB JE Recruitment 2026: రైల్వేలో 4,098 జూనియర్ ఇంజనీర్ పోస్టులు.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు
-
Rahul Gandhi: రక్తం ఓడుతున్న ముఖం, ఊడిపోయిన షూ.. ప్రధాని ఇంటి ముట్టడితో మారిన రాహుల్ గాంధీ పొలిటికల్ మార్క్!
-
IND vs ZIM: ముగ్గురు ఆటగాళ్లకు గాయాలు.. బరువు పెరిగిన స్టార్ ప్లేయర్.. తీవ్ర ఆందోళనలో బీసీసీఐ!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!