Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Congress Ponnam Prabhakar Bjp Bandi Sanjay Kishan Reddy Reservation Open Letter Telugu News

Ponnam Prabhakar: బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి కుట్ర చేస్తుంది..

Published Date :May 4, 2024 , 4:46 pm
By Rajesh Veeramalla
Ponnam Prabhakar: బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి కుట్ర చేస్తుంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్కు నేను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పండని అన్నారు. బీజేపీ రిజర్వేషన్లకు సంబంధించి మొసలి కన్నీరు కారుస్తూ.. రిజర్వేషన్లకు వ్యతిరేక ఉండే బీజేపీ బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లు అడిగేహక్కు లేదని అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయడానికి బీజేపీ కుట్ర చేస్తుందని తెలిపారు. తాము మండల కమిషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటే.. మీరు దేశ వ్యాప్తంగా కమండల యాత్ర పెట్టి మండల కమిషన్ అమలును వ్యతిరేకించింది బీజేపీ కాదా…? అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ రహిత భారతదేశాన్ని చేస్తామని అనేక సందర్భాల్లో చెప్పిన మాట వాస్తవం కాదా…? అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా కుల గణన సర్వే జరపాలని ఎవరికెంతో – వారికంత అని నినాదిస్తే.. ప్రభుత్వం తరుపున కుల గణన సర్వేకి సుప్రీం కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా…? అని మంత్రి ప్రశ్నించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమానత్వం కోరుకునే వాళ్ళంతా నక్సలైట్లు అంటున్నారు.. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు సమానత్వం కోరుకుంటే నక్సలైట్లు అవుతారా…? అని అన్నారు. సివిల్ సర్వీస్ లకు సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం కాదా..? అని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో సివిల్ సర్వీస్ లలో ఓబీసీలకు 27 % వాట దక్కాల్సి ఉండగా – దక్కిన వాట 15.92 %.. ఎస్సీలకు 15 % వాట దక్కాల్సి ఉండగా – దక్కిన వాట 7.65% మాత్రమేనని తెలిపారు. ఎస్టీలకు 7.5% వాట దక్కాల్సి ఉండగా – దక్కిన వాట 3.8% మాత్రమేనని అన్నారు.

Mumbai Indians: ప్లే ఆఫ్స్‌ ఛాన్సెస్ లేవు కాబట్టి.. కనీసం ఆ పనైనా చేయండి!

దేశ సంపద అంతా ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, ఎయిర్ పోర్టులు, పోర్టులు, జాతీయ రహదారులు.. అదానీ, అంబానీలకు అప్పగించి గతంలో ఎప్పుడూ లేని విధంగా మీ హయంలోనే 150 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థిక ఇబ్బందులు తీసుకొచ్చింది మీరు కాదా..? అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఉపర్ జై శ్రీరాం – అందర్ రిజర్వేషన్కు రాం రాం అంటున్నారన్నారు. మీరు ఎప్పుడూ పేద దళిత వర్గాలకు వ్యతిరేకంగా పని చేస్తారు .. తెలంగాణలో గత ఎన్నికల్లో బలహీన వర్గాల నుండి ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి.. కనీసం శాసనసభ పక్ష పదవి కూడా బీసీలకు ఎందుకు ఇవ్వలేదన్నారు. మీరు ఈ 10 సంవత్సరాల్లో దళితులు, బడుగు బలహీన వర్గాల సంక్షమం కోసం తీసుకున్న ఒక్క కార్యక్రమం అయినా చేపట్టారా అని ప్రశ్నించారు. తెలంగాణకి సంబంధించి 7 మండలాలు, సీలేరు ప్రాజెక్ట్లను ఆర్డినెన్సు ద్వారా ఆంధ్రాకి అప్పగిస్తే కనీసం స్పందించారా..? అని అన్నారు.

తెలంగాణలో మీకు ఓటు అడిగే హక్కు లేదు.. మేం తెలంగాణ ఏర్పాటుకు ఉద్యమించాం. కానీ ప్రధాని మోడీ తెలంగాణ ఏర్పాటుపై అవహేళన మాట్లాడుతూ అమరవీరులకు అవమానించిన కనీసం పార్లమెంట్లో ఉండి కూడా మీరు మాట్లాడలేదు… తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది..
తెలంగాణలో కుల గణన చేపట్టాం.. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం మేము ఎవరెంతో – వారికంత న్యాయం చేస్తామన్నారు. మీరు రాజకీయంగా గుజరాతీలకు తొత్తులుగా, బానిసలుగా పని చేయడం తప్ప తెలంగాణ విభజన హామీలు అమలు చేశారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • bjp
  • congress
  • Kishan Reddy
  • open letter

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions