Congress: జనవరి 2024లో భారత్ జోడో యాత్ర 2.0ని ప్రారంభించే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra 2.0: లోక్సభ ఎన్నికలకు ముందు 2024 జనవరి మొదటి వారం తర్వాత ఎప్పుడైనా భారత్ జోడో యాత్ర రెండవ దశను ప్రారంభించాలని కాంగ్రెస్ పరిశీలిస్తోందని సమాచారం. అయితే, భారత్ జోడో యాత్ర 2.0 రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగనుంది. అయితే, 2024 లోక్ సభ ఎన్నికల ముందు తూర్పు భారత్ ప్రాంతాల నుంచి పశ్చిమ ప్రాంతాల వరకు కూడా భారత్ జోడో యాత్ర వంటి ర్యాలీని నిర్వహిస్తామని కాంగ్రెస్ నేత తెలిపారు. ఈ యాత్ర కోసం రెండు మార్గాలను కాంగ్రెస్ అన్వేషిస్తుంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రారంభమై.. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రల మీదుగా కొనసాగుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చెప్పారు.
Read Also: CM Revanth Reddy: హైదరాబాద్కు సీఎం రేవంత్రెడ్డి.. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అసెంబ్లీకి
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఇక, సార్వత్రిక ఎన్నికలకు మరి కొంత సమయం మాత్రమే ఉండటంతో ప్రతిపక్ష పార్టీల నుంచి ప్రముఖులను సైతం ఈ యాత్రలో భాగం చేసేందుకు కాంగ్రెస్ చూస్తుంది. ఈ యాత్ర మొదటి విడతలో మాదిరిగానే ప్రతి రోజు రాహుల్ గాంధీ ప్రసంగించే బహిరంగ సభలపై ప్లాన్ చేస్తున్నారు. రేపటి నుంచి జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో భారత్ జోడోయాత్రపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. తూర్పు నుంచి పశ్చిమ వరకు ర్యాలీ నిర్వహించాలని కూడా ఓ ప్రతిపాదన ఉంది. అందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను కాంగ్రెస్ రూపొందిస్తుంది. లోక్ సభ ఎన్నికలకు ముందే ఈ ర్యాలీ ఉంటుంది. భారత్ జోడో యాత్రను రాజకీయాలకు అతీతంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీని ద్వారా దేశ సామరస్యతను పెంపొందిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత చెప్పారు.
Read Also: Pre Planned Bank Robbery: పక్కా ప్లాన్ ప్రకారమే.. ఐడీబీఐ బ్యాంకులో 46 లక్షల రూపాయలు చోరీ
అయితే, 2022 సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ తొలి విడత భారత్ జోడోయాత్ర ప్రారంభమై 2023 జనవరి 28లో జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్లో ముగిసింది. సుమారు 4 వేల 80 కిలోమీటర్ల దూరం ఆయన కాలి నడకన ప్రయాణం చేశారు. ఇది 12 రాష్ట్రాల్లోని 75 జిల్లాల గుండా కొనసాగింది. 126 రోజులలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సుధీర్ఘంగా రాహుల్ గాందీ పాదయాత్ర చేశాడు. అయితే, ప్రస్తుతం దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం లాంటి సమస్యలనూ జోడోయాత్రలో కాంగ్రెస్ లేవనెత్తబోతుంది. ఈ యాత్రలో అధికార బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా భారతదేశాన్ని ఏకం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో నిరుద్యోగం, అసమానత వంటి ఇతర సామాజిక-ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!