Airtel NBFC License: ఎయిర్టెల్ బిగ్ ప్లాన్.. ముఖేష్ అంబానీకి గట్టి పోటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel NBFC License: టెలికాం రంగంలో అగ్రగామిగా ఉన్న ఎయిర్టెల్, ఇప్పుడు ఆర్థిక రంగంలోకి అడుగుపెడుతోంది. తన సొంత ఫైనాన్స్ కంపెనీ అయిన ‘ఎయిర్టెల్ మనీ’ ద్వారా ఏకంగా రూ.20,000 కోట్ల పెట్టుబడితో రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. కేవలం రీఛార్జ్లు, ఇంటర్నెట్ మాత్రమే కాకుండా.. ఇకపై తన కస్టమర్లకు నేరుగా లోన్లు (అప్పులు) ఇచ్చేందుకు ఎయిర్టెల్ రంగం సిద్ధం చేసుకుంది. ఈ మూలధనంలో 70 శాతం ఎయిర్టెల్ ద్వారా, మిగిలిన 30 శాతం భారతీ ఎంటర్ప్రైజెస్ నుంచి వస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 13, 2026న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి NBFCగా పనిచేయడానికి ఎయిర్టెల్ మనీ లైసెన్స్ తీసుకుంది.
READ ALSO: HPV vaccination: గర్భాశయ క్యాన్సర్లకు చెక్.. దేశవ్యాప్తంగా ఉచితంగా HPV వ్యాక్సినేషన్..
Also Read
- Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
- Smartphone Price Hike: స్మార్ట్ఫోన్ ప్రియులకు ‘షాక్’.. విపరీతంగా పెరుగుతున్న మొబైల్ ధరలు.. కారణం ఇదే!
- Campa Cola vs Coca-Cola: 'కోలా వార్'లో కొత్త మలుపు.. అంబానీ 'క్యాంపా' దెబ్బకు కోక్, పెప్సీ షాక్! ఫ్రీగా రిఫ్రిజిరేటర్లు..
- Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి
రాబోయే కొద్ది ఏళ్లలో రూ.20,000 కోట్లను ఈ కంపెనీలో పెట్టబోతున్నారని సమాచారం. ఇందులో 70% ఎయిర్టెల్ నుంచి, 30% భారతీ ఎంటర్ప్రైజెస్ నుంచి పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఈ నిర్ణయంతో అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కు ఎయిర్టెల్ గట్టి పోటీని ఇవ్వబోతోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్టెల్ గత రెండేళ్లలోనే తన డిజిటల్ యాప్ ద్వారా సుమారు రూ.9,000 కోట్ల లోన్లను ఇచ్చింది. ఇప్పుడు సొంతంగా ఫైనాన్స్ కంపెనీ పెడుతుండటంతో ఈ ప్రక్రియ ఇంకా వేగవంతం కానుందని అంచనా వేస్తున్నారు. కంపెనీ దగ్గర కస్టమర్ల డేటా, టెక్నాలజీ ఉండటం వల్ల, లోన్ తీసుకునే వారు తిరిగి కడతారా లేదా అనే రిస్క్ను ముందే అంచనా వేయగలమని ఎయిర్టెల్ నమ్మకంగా ఉంది. ఇప్పటివరకు ఎయిర్టెల్ కస్టమర్లు తమ యాప్ ద్వారా ఇతర బ్యాంకుల లోన్లు తీసుకునేవారు. కానీ ఇకపై ఎయిర్టెల్ తన సొంత డబ్బుతోనే కస్టమర్లకు చిన్న చిన్న లోన్లు, బిజినెస్ లోన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు, వ్యాపారులకు సులభంగా లోన్లు దొరుకుతాయి. ఎయిర్టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. NBFC విస్తరణ ద్వారా విశ్వసనీయమైన, వినూత్నమైన డిజిటల్ లెండింగ్ వ్యాపారాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని అన్నారు.
READ ALSO: High Court: “జాతకం” పేరుతో మోసం చేస్తే రేప్ కేసు తప్పదు.. హైకోర్టు కీలక తీర్పు..
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!