Airtel NBFC License: ఎయిర్టెల్ బిగ్ ప్లాన్.. ముఖేష్ అంబానీకి గట్టి పోటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel NBFC License: టెలికాం రంగంలో అగ్రగామిగా ఉన్న ఎయిర్టెల్, ఇప్పుడు ఆర్థిక రంగంలోకి అడుగుపెడుతోంది. తన సొంత ఫైనాన్స్ కంపెనీ అయిన ‘ఎయిర్టెల్ మనీ’ ద్వారా ఏకంగా రూ.20,000 కోట్ల పెట్టుబడితో రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. కేవలం రీఛార్జ్లు, ఇంటర్నెట్ మాత్రమే కాకుండా.. ఇకపై తన కస్టమర్లకు నేరుగా లోన్లు (అప్పులు) ఇచ్చేందుకు ఎయిర్టెల్ రంగం సిద్ధం చేసుకుంది. ఈ మూలధనంలో 70 శాతం ఎయిర్టెల్ ద్వారా, మిగిలిన 30 శాతం భారతీ ఎంటర్ప్రైజెస్ నుంచి వస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 13, 2026న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి NBFCగా పనిచేయడానికి ఎయిర్టెల్ మనీ లైసెన్స్ తీసుకుంది.
READ ALSO: HPV vaccination: గర్భాశయ క్యాన్సర్లకు చెక్.. దేశవ్యాప్తంగా ఉచితంగా HPV వ్యాక్సినేషన్..
Also Read
- Market Crash: స్విగ్గీ, జొమాటోలకు రూ.1.41 లక్షల కోట్ల భారీ లాస్.. ఏం జరిగిందంటే?
- Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
- Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
రాబోయే కొద్ది ఏళ్లలో రూ.20,000 కోట్లను ఈ కంపెనీలో పెట్టబోతున్నారని సమాచారం. ఇందులో 70% ఎయిర్టెల్ నుంచి, 30% భారతీ ఎంటర్ప్రైజెస్ నుంచి పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఈ నిర్ణయంతో అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కు ఎయిర్టెల్ గట్టి పోటీని ఇవ్వబోతోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్టెల్ గత రెండేళ్లలోనే తన డిజిటల్ యాప్ ద్వారా సుమారు రూ.9,000 కోట్ల లోన్లను ఇచ్చింది. ఇప్పుడు సొంతంగా ఫైనాన్స్ కంపెనీ పెడుతుండటంతో ఈ ప్రక్రియ ఇంకా వేగవంతం కానుందని అంచనా వేస్తున్నారు. కంపెనీ దగ్గర కస్టమర్ల డేటా, టెక్నాలజీ ఉండటం వల్ల, లోన్ తీసుకునే వారు తిరిగి కడతారా లేదా అనే రిస్క్ను ముందే అంచనా వేయగలమని ఎయిర్టెల్ నమ్మకంగా ఉంది. ఇప్పటివరకు ఎయిర్టెల్ కస్టమర్లు తమ యాప్ ద్వారా ఇతర బ్యాంకుల లోన్లు తీసుకునేవారు. కానీ ఇకపై ఎయిర్టెల్ తన సొంత డబ్బుతోనే కస్టమర్లకు చిన్న చిన్న లోన్లు, బిజినెస్ లోన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు, వ్యాపారులకు సులభంగా లోన్లు దొరుకుతాయి. ఎయిర్టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. NBFC విస్తరణ ద్వారా విశ్వసనీయమైన, వినూత్నమైన డిజిటల్ లెండింగ్ వ్యాపారాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని అన్నారు.
READ ALSO: High Court: “జాతకం” పేరుతో మోసం చేస్తే రేప్ కేసు తప్పదు.. హైకోర్టు కీలక తీర్పు..
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!