Nirmal: బ్లాక్ మెయిలర్లు, చీటర్లు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు.. కాంగ్రెస్ నేతల నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లు మంత్రిగా ఉండి అధికార దాహంతో అక్రమంగా సంపాదించుకున్న అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వచ్చేందుకు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మాజీ మంత్రిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలో హస్తం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు నివాసం వద్ద మాజీ మంత్రిని చేర్చుకోవద్దంటూ నినాదాలు చేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడికి వినతిపత్రం అందజేశారు. మాజీమంత్రి అతని కుటుంబీకులు అక్రమంగా ఆక్రమించుకున్న చెరువులు, కందకాలు డి1 పట్టాలను కాపాడుకోడానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
గత రాజకీయ చరిత్ర అంతా ఊసరవెల్లి లాగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ జెండా పట్టుకుంటూ, 30 సంవత్సరాల రాజకీయంలో విలువలు సిద్ధాంతం లేని వ్యక్తి మాజీ మంత్రి అల్లోల అని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. గత పది సంవత్సరాలుగా మంత్రిగా ఉండి కనిపించిన చెరువుని, గుడిని గుడిలో ఉన్న లింగాన్ని భూములను, మున్సిపల్ ఉద్యోగాల్లో అవినీతికి పాల్పడి ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. మాజీ మంత్రి కుటుంబ అధికార దాహాన్ని భరించలేకనే ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెడితే.. సిగ్గు లేకుండా అధికార పార్టీలోకి వస్తా అంటున్నావని మండిపడ్డారు. 78 సంవత్సరాలు వచ్చినా.. ఇంకా అధికార దాహం తీరలేదా అని ప్రశ్నించారు. ఇలాంటి నాయకున్ని పార్టీలో చేర్చుకోవద్దంటూ సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించాలని కోరారు. కబ్జా మాజీ మంత్రి పార్టీలోకి వస్తే కాంగ్రెస్ కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.
Also Read
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేత..
మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దంటూ జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్కకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. అవినీతి భూకబ్జాల బీఆర్ఎస్ నేత మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దంటూ విన్నవించారు.
బ్లాక్ మెయిలర్స్, చీటర్లను పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు..
బ్లాక్ మెయిలర్స్, చీటర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జూ అన్నారు. మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ లోకి చేర్చుకోవద్దంటూ నిరసన ఆందోళన కార్యక్రమాలను పార్టీ అధిష్టానం గమనిస్తుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చే విషయం తనకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు.
తాజావార్తలు
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..