Madhya Pradesh: కాంగ్రెస్కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన 100 మంది కీలక నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేతో సహా కీలకమైన 100కు పైగా నేతలు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసిన మరుసటి చోటు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశ నెలకొంది. ఇక, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే హరివల్లభ్ శుక్లా, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమల్ సింగ్ రఘువంశీతో సహా పలువురు నేతలు బీజేపీలో చేరారు. వీరంద్దరూ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్, బీజేపీ కొత్త చేరికల సంఘం రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ నరోత్తమ్ మిశ్రా సమక్షంలో కమలం పార్టీలో జాయిన్ అయ్యారు.
Read Also: Saurabh Bhardwaj: కేజ్రీవాల్ను చంపేందుకు జైల్లో కుట్ర జరుగుతుంది..
Also Read
- Google Chrome Security Warning: క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. మీ బ్యాంక్ ఖాతా ఎప్పుడైనా ఖాళీ కావొచ్చు..!
- Kitchen Tips: ఉడికించిన బంగాళాదుంపల తొక్క తీసేటప్పుడు చేతులు కాలుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్తో క్షణాల్లో తొక్క ఊడిపోతుంది!
- KTR: వాటిని చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.. కేటీఆర్ హాట్ కామెంట్స్.!
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సురేశ్ పచౌరీ, మంత్రి గోవింద్ సింగ్ రాజ్పుత్ కూడా ఉన్నారు. ప్రపంచంలోనే బీజేపీని అతిపెద్ద పార్టీగా తీర్చిదిద్దాలని, దేశానికి, రాష్ట్రానికి సేవ చేయాలనుకునే వారికి బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నామని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. బీజేపీ ప్రజాస్వామ్య రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో బంధుప్రీతి మాత్రమే కనిపిస్తోంది అని విమర్శలు గుప్పించారు. కాగా, రాష్ట్రంలో చింద్వారాతో సహా మొత్తం 29 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి మోడీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే ఛాన్స్ ఉంది. ఇక, మాజీ సీఎం కమల్ నాథ్ను హేళన చేస్తూ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఓట్లు అడిగేందుకు మొదటిసారిగా పెద్ద మహారాజ్ ఓటర్ల మధ్యకు చేతులు జోడించి తన ఇంటి నుంచి బయటకు వచ్చారన్నారు. అతని చింద్వారా మోడల్ ఎంత దారుణంగా ఉందో అందరూ చూశారంటూ మండిపడ్డారు.
Read Also: Chandrababu: ఇదే నా జన్మదిన ఆశయం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఇక, శివపురి మాజీ ఎమ్మెల్యే హరివల్లభ శుక్లా, ఎంపీ కాంగ్రెస్ సింధీ కళ్యాణ్ సమితి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మహేశ్ గుర్బానీ, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి కమల్ సింగ్ రఘువంశీ, శివపురిలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అలోక్ శుక్లా, సోషల్ మీడియా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు (టీమ్ కమల్ నాథ్) గౌరవ్ శర్మ, రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి అమిత్ దంత్రే, నర్మదాపురంలో కాంగ్రెస్ సేవాదళ్ ఉపాధ్యక్షుడు రాహుల్ సింగ్ సహా 100 మందికి పైగా కాంగ్రెస్ నేతలు భారతీయ జనతా పార్టీలో చేరారు.
#WATCH भापोल: मध्य प्रदेश के मुख्यमंत्री मोहन यादव ने कहा, "चारों तरफ से रुझान अनुकूल आ रहे हैं। प्रचंड बहुमत के साथ भाजपा की सरकार बनने जा रही है। फिर एक बार मोदी सरकार बनने जा रही है। छिंदवाड़ा सहित प्रदेश की 29 सीट हम जीतने की ओर बढ़ रहे हैं। पहली बार बड़े महाराज अपने घर से… pic.twitter.com/h6HTRZZ26l
— ANI_HindiNews (@AHindinews) April 20, 2024
తాజావార్తలు
-
Google Chrome Security Warning: క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. మీ బ్యాంక్ ఖాతా ఎప్పుడైనా ఖాళీ కావొచ్చు..!
-
Prabhas: రెండు ఎకరాల్లో ప్రభాస్ అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్?
-
Tollywood 2026 First Half: సోసోగా ఫస్ట్ హాఫ్ ..ఆశలన్నీ సెకండాఫ్ మీదే?
-
Kitchen Tips: ఉడికించిన బంగాళాదుంపల తొక్క తీసేటప్పుడు చేతులు కాలుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్తో క్షణాల్లో తొక్క ఊడిపోతుంది!
-
Karthi: కార్తి బర్త్డే ట్రీట్.. సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి బిగ్ అనౌన్స్మెంట్
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!