Chandrababu: ఇదే నా జన్మదిన ఆశయం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: ప్రజల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నానని.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నానన్నారు. తాను ఎప్పుడూ బ్యాలన్స్ తప్పలేదని.. పేదల కోసమే బతుకుతున్నానన్నారు. గూడూరులో సిలికా…స్వర్ణముఖి నదిలో ఇసుకను దోచుకున్నారని.. సిలికా పరిశ్రమలు వచ్చి పిల్లలకు ఉద్యోగాలు రావాలని కోరుకున్నానన్నారు. స్వర్ణముఖిలో చెక్ డ్యామ్లు కట్టి నీటిని నిల్వ చేయాలన్నారు. కానీ వందల లారీల మేర ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపదను సృష్టించడం టీడీపీకే తెలుసన్నారు. ప్రపంచంలోనే తెలుగు ప్రజలకు మరింత గుర్తింపు తీసుకు రావాలనేదే లక్ష్యమన్నారు. గూడూరు మహిళా సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు.
Read Also: Yarlagadda VenkatRao: ఒక్కసారి అవకాశం ఇస్తే.. గన్నవరం రూపురేఖలు మారుస్తా..
Also Read
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
జగన్ అందరినీ మోసం చేశారని.. ఎక్కడ చూసినా కుంభకోణాలేనని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలనేది నా లక్ష్యమని.. ఇదే నా జన్మదిన ఆశయమని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళల్లో ఎంతో చైతన్యం వచ్చిందని.. మహిళల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం… ఆస్తి హక్కును ఎన్.టి.ఆర్ కల్పించారని ఆయన చెప్పారు. చట్ట సభల్లో కూడా 33 శాతం రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల నాటికి అమలు అవుతాయన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు ఎన్టీఆర్ రిజర్వేషన్ ఇచ్చారన్నారు. జనాభాలో 50 శాతం ఉన్న మహిళల కోసం డ్వాక్రా సంఘాలు పెట్టానని.. మహిళలను పొదుపు ద్వారా ఆర్థికంగా బలోపేతం చేశానన్నారు. కుటుంబానికి ఆర్ధిక మంత్రిగా మహిళలను చేశానన్నారు. మహిళలకు కళాశాలల్లో సీట్లు…ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. ఐటీ రంగంలో కూడా మహిళలు రాణిస్తున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు.
గూడూరు మహిళా సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. “సమాజంలో ఆడ.. మగ మధ్య తేడా లేదు. వచ్చే ఎన్నికల్లో మహిళలు టీడీపీకి మద్దతు ఇస్తారు. మహిళల కోసం మహాశక్తి కార్యక్రమాన్ని టీడీపీ చేపట్టింది. 18 సంవత్సరాలు పై బడిన మహిళలకు నెలకు రూ.1800 ఇస్తాం. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకూ నెలకు రూ.15 వేలు ఇస్తాం. దీపం కింద ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. పెన్షన్ ను రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచాను. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లు ఇస్తాను. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేదు ముఖ్యమంత్రి అయిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి…నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తాం. జాబ్ క్యాలండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇంటి వద్ద పింఛన్ ఇచ్చే సదుపాయం ఉన్నా ప్రభుత్వం ఇవ్వలేదు. ఏప్రిల్ నుంచి రూ.4 వేల పెన్షన్ ఇస్తాం. వికలాంగులకు రూ.6 వేలు…పెన్షన్…వాలంటీర్లకు రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తాం. ” అని చంద్రబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!