ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సరికొత్త విజువల్ వండర్గా నిలిచిన ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా రెండో భాగం (Kalki 2 Sequel) కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా ప్రారంభమైంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈసారి రెండో భాగాన్ని మరింత గ్రాండ్గా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ లేటెస్ట్ షెడ్యూల్ను లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ (సుప్రీం యాస్కిన్) పై చిత్రీకరిస్తున్న కీలక సన్నివేశాలతో మొదలుపెట్టారు.
మొదటి భాగంలో కేవలం అతిథి పాత్రలా కనిపించిన యాస్కిన్ పాత్ర, రెండో భాగంలో అసలైన విలన్ గా అలరించబోతున్నాడు. కమల్ హాసన్ లుక్, ఆయన నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
Also Read:Pradeep Ranganathan: చేతిలో 8 సినిమాలు.. ₹25 కోట్ల రెమ్యునరేషన్! అయినా డేట్ల కోసం నిర్మాతల క్యూ
ముంబై మరియు హైదరాబాద్లోని ప్రత్యేక సెట్స్లో ఈ చిత్రీకరణ జరుగుతోంది. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్లోనే అత్యంత బిజీ ఫేజ్లో ఉన్నారు. ఆయన నటించిన మూడు భారీ చిత్రాలు ప్రస్తుతం ఒకే సమయంలో సెట్స్పై ఉండటం విశేషం.
ప్రస్తుతం కమల్ హాసన్, అమితాబ్ లు తమ భాగం షూటింగ్లో పాల్గొంటుండగా, ప్రభాస్ మరికొన్ని రోజుల్లో ఈ సెట్స్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. తన ఇతర చిత్రాల షెడ్యూల్స్ పూర్తి చేసుకొని, ‘భైరవ’గా మళ్ళీ కల్కి ప్రపంచంలోకి ప్రభాస్ ఎంట్రీ ఇవ్వనున్నారు.
మొదటి భాగం అందించిన ఉత్సాహంతో, సీక్వెల్లో విజువల్ ఎఫెక్ట్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారు. కథలో ఉన్న సస్పెన్స్, అశ్వత్థామ మరియు భైరవ మధ్య ఉండే పోరాట ఘట్టాలు ఈసారి నెక్స్ట్ లెవల్లో ఉంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.