Haryana: ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్.. గవర్నర్ కి వినతి పత్రం
- నేడు గవర్నర్ ని కలిసిన కాంగ్రెస్ బృందం
- కాంగ్రెస్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ భాన్ విలేకర్ల సమావేశం
- గతంలో బలపరీక్ష డిమాండ్ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకోవడం గమనార్హం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలో రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ హర్యానా గవర్నర్ బండారుదుత్త త్రేయకు కాంగ్రెస్ ప్రతినిధి బృందం గురువారం మెమోరాండం సమర్పించింది. ఈ ప్రతినిధి బృందంలో ప్రతిపక్ష నేత భూపేంద్ర హుడా, కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాన్తో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో బీబీ బాత్రా, అఫ్తాబ్ అహ్మద్, గీతా భుక్కల్ ఉన్నారు.
READ MORE: Domestic Airline Market: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా అవతరించిన ఇండియా..
Also Read
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
- Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
- Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు'.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
గవర్నర్ను కలిసిన అనంతరం రాజ్భవన్ నుంచి కాంగ్రెస్ బృందంతో బయలుదేరిన భూపేంద్ర హుడా.. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని హుడా గవర్నర్ను డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ భాన్తో కలిసి హుడా విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. మరికొద్ది సేపట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభిస్తారని, అందులో గవర్నర్తో ఏం చర్చించారో హుడా చెప్పనున్నారు. గతంలో కాంగ్రెస్ బలపరీక్ష డిమాండ్ చేయగా.. ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకోవడం గమనార్హం. వాస్తవానికి, బీజేపీతో పోలిస్తే ప్రతిపక్ష శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యకు అనుగుణంగా హర్యానా కాంగ్రెస్ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు బలపరీక్షకు బదులు అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే కిరణ్ చౌదరి కాంగ్రెస్ను వీడిన తర్వాత అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 28కి తగ్గిందని తెలిసిందే. గతంలో వరుణ్ చౌదరి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ముల్లానా అసెంబ్లీకి రాజీనామా చేశారు.
తాజావార్తలు
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?