Congress: నేడే కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం.. నాగ్ పూర్ లో బహిరంగ సభ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagpur: ఇవాళ కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో భారీ బహిరంగ సభకు పార్టీ అధిష్టానం ఏర్పాట్లు చేసింది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే కూడా హాజరు కాబోతున్నారు. అలాగే పార్టీ సీనియర్ నేతలతో పాటు ఇండియా కూటమి నేతలు సైతం ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు. త్వరలోనే లోక్ సభ ఎన్నికలు వస్తుండటంతో ఏఐసీసీ ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంది.
Read Also: YV SUbba Reddy: వైసీపీ టార్గెట్ అదే.. అందుకే ఈ మార్పులు..!
Also Read
- FIFA World Cup 2026: సరికొత్త చరిత్ర సృష్టించిన lionel Messi.. అల్జీరియాపై హ్యాట్రిక్ గోల్స్ నమోదు.!
- Hormuz Strait: ప్రపంచానికి ఊపిరి పోసిన అమెరికా-ఇరాన్ ఒప్పందం.. హర్మూజ్ గుండా చమురు రవాణా షురూ..
- ICC Women's T20 World Cup: భారత్ చేతిలో ఘోర పరాజయం.. పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
కాగా, ఈ ఆవిర్భావ దినోత్సవ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తరలి వెళ్తున్నారు. సుమారు 10 లక్షల మంది ఈ సభలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. అయితే, తెలంగాణ నుంచి 50 వేల మంది కార్యకర్తలు వెళ్తున్నట్లు టాక్. ప్రతి నియోజకవర్గం నుంచి సభకు వెళ్లే కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వెహికిల్స్ ను రెడీ చేసింది.
Read Also: Nampally Exhibition: నాంపల్లిలో జనవరి 1 నుంచి నుమాయిష్.. టికెట్ ధర ఎంతంటే..?
అయితే, ఈ సభను సక్సెస్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సభకు జనసమీకరణ కోసం మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేశారు. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ప్రత్యేక విమానంలో నాగ్ పూర్ చేరుకోబోతున్నారు.
Read Also: Vijayakanth: మార్కెట్ కోసం ఇతర భాషల్లో సినిమాలు చేయని ఏకైక తమిళ స్టార్
మరోవైపు గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించాల్సి ఉండగా.. ఆయన నాగ్ పూర్ కు వెళ్తుండటంతో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సేవాదళ్ ఆధ్వర్యంలో గాంధీభవన్ నుంచి నెక్లెస్ రోడ్ లోని ఇందిరా భవన్ వరకు భారీ ర్యాలీ తీయనున్నారు.
తాజావార్తలు
-
FIFA World Cup 2026: సరికొత్త చరిత్ర సృష్టించిన lionel Messi.. అల్జీరియాపై హ్యాట్రిక్ గోల్స్ నమోదు.!
-
Prabhas : రెబల్ ఫ్యాన్స్ యుద్ధానికి సిద్ధమవండి!
-
Raj Nidimoru : హిందీ సినిమాలలో మెగాస్టార్ రిఫరెన్స్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా ?
-
Hormuz Strait: ప్రపంచానికి ఊపిరి పోసిన అమెరికా-ఇరాన్ ఒప్పందం.. హర్మూజ్ గుండా చమురు రవాణా షురూ..
-
Rohit Sharma: ‘అతనికి ప్రతిభ పుట్టుకతో రాలేదు..’ రోహిత్ శర్మపై రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!