Congress: ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి కంటతడి.. ఎన్నికల స్టంట్ అన్న బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఇక అభ్యర్థుల తరపున పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రులు, స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక అభ్యర్థులైతే.. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు. అయితే తాజాగా మధ్యప్రదేశ్లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రచార సభలో కాంగ్రెస్ అభ్యర్థి భోరున విలపించారు. దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల స్టంట్లో భాగమని కొట్టిపారేసింది.
ఇది కూడా చదవండి: Telangana: కాంగ్రెస్ జైత్రయాత్రకు నాందిగా ‘జనజాతర’.. 6న భారీ బహిరంగ సభ
Also Read
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
మధ్యప్రదేశ్లోని దామోహ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తార్వార్ సింగ్ లోధి బరిలో ఉన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే సభలో ఆ పార్టీ నాయకుడు జితు పట్వారీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థి తార్వార్ సింగ్ లోధి దగ్గర డబ్బులేదు గానీ.. అతనిలో మాత్రం నిజాయితీ ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాదు అతడు మీ కొడుకు.. మీ సోదరుడు.. మీ కుటుంబ సభ్యుడు అని చెప్పగానే స్టేజ్పైనే తార్వార్ సింగ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అతను మాట్లాడినంత సేపు ఏడుస్తూనే ఉన్నారు. దీంతో సహచర నాయకులంతా తార్వార్ సింగ్ను ఓదార్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: Allu Ayan : నా చిన్ని బాబు.. నా ప్రాణం అల్లు అయాన్కు ఐకాన్ స్టార్ స్పెషల్ విషెష్..
అయితే ఈ సంఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ అభ్యర్థి రాహుల్ సింగ్ లోధి మాట్లాడుతూ.. పొలిటికల్ స్టంట్ అంటూ కొట్టిపారేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకే రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం ఇంతగా ఏడ్వాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. దామోహ్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఎలాంటి అవకాశం లేదన్న ఆలోచనతో ఏడ్చి ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. ఇంతగా దిగజారాల్సిన అవసరం ఏమొచ్చిందని.. తనకైతే ఆశ్చర్యం కలుగుతుందని రాహుల్ లోధి పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్లో నాలుగు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13న పోలింగ్ జరగనుంది. దామోహ్తో సహా మరో ఆరు పార్లమెంట్ స్థానాలకు ఈ నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.
ఇది కూడా చదవండి: Manda Krishna: తన బిడ్డ భవిష్యత్ కోసమే.. కడియం శ్రీహరిపై మందకృష్ణ ఫైర్
తాజావార్తలు
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
-
INDW vs AUSW: గ్రూప్-ఏలో ఉత్కంఠభరిత పోటీ.. భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి!
-
Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
-
DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్ను నిండా ముంచేసిన ఇరాన్!
-
Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!